సత్తెనపల్లి డీఎస్పీగా ఎంవీకే చైతన్య బాధ్యతల స్వీకారం
సత్తెనపల్లి, జూలై 27, (సీమకిరణం న్యూస్) :
నూతన డీఎస్పీగా నియమితులైన ఎంవీకే చైతన్య సోమవారం సత్తెనపల్లిలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేసి అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విధులు నిర్వహిస్తానని డీఎస్పీ ఎంవీకే చైతన్య పేర్కొన్నారు.

