Saturday, July 25, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఆటోలో దృష్టి మళ్లించి బంగారు గొలుసు చోరీ.. చెన్నై మహిళ అరెస్ట్

ఆటోలో దృష్టి మళ్లించి బంగారు గొలుసు చోరీ.. చెన్నై మహిళ అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఆటోలో దృష్టి మళ్లించి బంగారు గొలుసు చోరీ.. చెన్నై మహిళ అరెస్ట్

 

కర్నూలు క్రైమ్, జూలై 17 , (సీమకిరణం న్యూస్): 

 

దృష్టి మళ్లించి బంగారు పుస్తెల హారాన్ని కత్తిరించి అపహరించేందుకు ప్రయత్నించిన తమిళనాడుకు చెందిన మహిళను కర్నూలు నాలుగవ పట్టణ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. కొలిమిగుండ్ల మండలానికి చెందిన ఓ మహిళ పెద్దపాడు నుంచి కర్నూలుకు ఆటోలో ప్రయాణిస్తుండగా, అదే ఆటోలో తోటి ప్రయాణికురాలిగా ఎక్కిన ఓ మహిళ కర్నూలు టౌన్‌లోని గోపి హోటల్ సమీపంలో బాధితురాలు ఆటో దిగుతున్న సమయంలో ఆమె దృష్టి మళ్లించి మెడలో ఉన్న బంగారు పుస్తెల హారాన్ని కత్తిరించి పారిపోవడానికి ప్రయత్నించింది. బాధితురాలి అరుపులు విన్న కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన బీట్ కానిస్టేబుల్ పీ. రామకృష్ణ వెంటనే అప్రమత్తమై నిందితురాలిని వెంబడించారు. సమీపంలో ఉన్న మహిళల సహకారంతో ఆమెను పట్టుకుని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితురాలు ఎసక్కీ అమ్మాల్ (36), భర్త సురేష్, కోవిల్‌పట్టి, తూత్తుకుడి జిల్లా, తమిళనాడుకు చెందినదిగా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి సుమారు 2.85 తులాల బంగారు పుస్తెల హారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular