ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
APSRTC కీలక ప్రకటన చేసింది. మహాశివరాత్రి పర్వదినం వేళ భక్తులు పెద్ద సంఖ్యలో శైవ క్షేత్రాలకు వెళ్తారు. వీరి కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను కేటాయించింది. అందులో భాగంగా రూట్లను ఖరారు చేసింది. ఛార్జీలను చేర్చారు. కాగా, ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని అధికారులు ఏర్పాటు చేశారు. ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల డిమాండ్లకు అనుగుణంగా ఈ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవసరం అయితే మరిన్ని కేటాయించేందుకు సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ బస్సు అధికారులు.
మహా శివరాత్రి వేళ ఆర్టీసీ భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే సౌత్ భక్తులక ర్యార్ధం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీపీటీవో టీ అజిత కుమారి తెలిపారు. ప్రత్యేక బస్సుల్లోనూ స్ర్తి శక్తి పథకం అమలు చేయవలసి ఉంటుంది. కోటప్పకొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవేసేందుకు 95 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రత్యేక బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం అమలవుతుందని వివరించారు. కోటప్పకొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవేసేందుకు 95 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది కోటప్పకొండ నుంచి నరసరావుపేటకు తిరుగు ప్రయాణంలో బస్స్టేషన్ను పెట్లూరివారిపాలెం రోడ్డు మార్గంలో ఏర్పాటు చేశారు.

మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి
ఈ ఏడాది కూడా నరసరావుపేట నుంచి కొండ వరకు రూ. 30లు, కొండ దిగువ నుంచి పైకి రూ. 25లు ఛార్టీలు వసూలు చేసినట్లు చెప్పారు. అయితే, మహిళలు మాత్రం ఈ బస్సుల్లోనూ ఎలాంటి టికెట్ లేకుండా ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు నిర్ధారించారు. మరోవైపు శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లా ఐదు డిపోల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కర్నూలు బస్టాండ్లో భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా పెరిగిన ఎండల తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. కర్నూలు నుంచి వెంకటాపురం వరకు బస్సులో ప్రయాణించి, అక్కడి నుంచి పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు కూడా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు గుర్తించారు.

