నేపాల్లో వరదలు.. వందల మంది మృతి
నేపాల్లో భారీ ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. టిబెట్ ప్రాంతంలో ప్రారంభమైన వరదలు నేపాల్లోని పలు పట్టణాలు, గ్రామాలను ముంచెత్తాయి. ఈ ఘటనలో వందల మంది మృతి చెందగా, మరో 800 మంది గల్లంతైనట్లు సమాచారం. వరదలు కారణంగా రోడ్లు, వంతెనలు ధ్వంసమవడంతో పాటు పది హైడ్రోపవర్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి.

