అక్టోబర్ లేదా నవంబర్లో కొత్త పింఛన్లు : బోండా ఉమా
కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ అక్టోబర్ లేదా నవంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. అర్హులైన వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

