తాడిపత్రి, జూలై 06, (సీమ కిరణం న్యూస్) :
తాడిపత్రి అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రోహిత్ కుమార్ చౌదరి బదిలీ అయ్యారు. ఇక్కడి నుంచి ఆయనను పల్నాడు జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాడిపత్రిలో తన సేవలందించిన ఆయన, ఇకపై పల్నాడు జిల్లాలో అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు బదిలీ ఉత్తర్వులను అధికారికంగా విడుదల చేశారు..

