Sunday, March 22, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఏపీకి మరో భారీ పరిశ్రమ: లక్షల కోట్ల పెట్టుబడి.. ఎల్లుండే భూమిపూజ | ప్రధాన పెట్టుబడి:...

ఏపీకి మరో భారీ పరిశ్రమ: లక్షల కోట్ల పెట్టుబడి.. ఎల్లుండే భూమిపూజ | ప్రధాన పెట్టుబడి: లక్ష ఓపెనింగ్స్ లక్ష్యంగా ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ APలో రూ. 1.36 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయి-లింగారెడ్డి గజ్జల

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రూపాన్ని మార్చేస్తే మరో బృహత్తర ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది. ప్రపంచ ఉక్కు దిగ్గజం ‘ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా’ (AMNS India) అనకాపల్లి జిల్లాలో తన గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను స్థాపించనుంది. రూ. 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టుకు 23న (సోమవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులతో కలిసి భూమిపూజ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల కాలంలో రాష్ట్రానికి చేరిన అతిపెద్ద పారిశ్రామిక విజయంగా ఇది నిలవనుంది.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సుమారు 5,465 ఎకరాల్లో ఈ ప్లాంట్ సాకారం ఉంది. ఏడాదికి 17. 8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో రెండు దశల్లో ఈ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా, దీనికి అనుబంధంగా రూ. 11,198 కోట్ల వ్యయంతో 316 ఎకరాల్లో ప్రత్యేకంగా ‘క్యాప్టివ్ పోర్టు’ను కూడా నిర్మించనున్నారు. ఈ పోర్టు ద్వారా మరో 6,000 మందికి అదనంగా ఉద్యోగాలు లభించనున్నాయి.

అనకాపల్లిలో రూ. 136 లక్షల కోట్లతో ఆర్సెలర్‌ మిట్టల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఉక్కు విప్లవం.

ప్రాథమిక సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం వేగం

ఈ భారీ పరిశ్రమ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను జాతీయ రహదారి (NH-16)తో కలిపేల 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనమిక్ రీజియన్ దేశంలోనే కీలకమైన పరిశ్రమల హబ్‌గా అవతరించనుంది.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్..

సోమవారం మధ్యాహ్నం 3.40 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నక్కపల్లి చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఏఎన్‌ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ స్వయంగా ఈ భూమిపూజలో పాల్గొనడం విశేషం. అనంతరం ముఖ్యమంత్రి పలు అవగాహన ఒప్పందాల (MoUs) కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular