Thursday, April 23, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపాకిస్థాన్ కు భారత్ మాస్టర్ స్ట్రోక్.. ఏప్రిల్ నుంచి ఆ దేశ పరిస్థితి ఏంటో..! |...

పాకిస్థాన్ కు భారత్ మాస్టర్ స్ట్రోక్.. ఏప్రిల్ నుంచి ఆ దేశ పరిస్థితి ఏంటో..! | షాపుర్‌కండి బ్యారేజీని మార్చి 31 నాటికి సిద్ధం చేయండి, ఏప్రిల్ నుండి పాకిస్తాన్‌కు మిగులు రావి నీటి ప్రవాహాన్ని భారతదేశం ఆపుతుంది

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

ఏప్రిల్ 22న ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించిన విషయం తెలిసిందే. మే 7- 10 వరకు పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అలాగే అటారీ- వాఘా బోర్డర్ మూసివేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ప్రయాణాలు పూర్తిగా నిషేధించబడ్డాయి. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఈ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది.

అయితే పాకిస్థాన్ మరో షాక్ తగలనుంది. వేసవి నేపథ్యంలో పాకిస్థాన్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని భావించవచ్చు. రావి నదిపై షాపూర్ కండి బ్యారేజ్ మార్చి 31 నాటికి పూర్తి కావాల్సి ఉంది. దీంతో ఏప్రిల్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా నిలిపివేసింది జమ్మూకాశ్మీర్ మంత్రి జావెద్ అహ్మద్. 1960 ఒప్పందం ప్రకారం ఈ నదిపై భారత్ కే పూర్తి హక్కులు ఉన్నాయి. కానీ ఇన్నాళ్లూ ప్రాజెక్టులు లేక నీరు వృథాగా పాకిస్థాన్ కు వెళ్లేది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ నీటితో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లకు సాగునీరు అందనుంది.

ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ జలవనరుల శాఖ మంత్రి జావెద్ అహ్మద్ రాణా మాట్లాడుతూ.. పంజాబ్ సరిహద్దులో ఉన్న ఈ షాపుర్ కండి డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని అన్నారు. ఇది పూర్తయిన తర్వాత రావి నది నుండి పాకిస్థాన్‌కు వెళ్లే అదనపు నీరు ఆగిపోతుందని. రావి నది నుండి పాకిస్తాన్ కు వెళ్లే అదనపు నీటిని నిలిపివేయాలి అని ఈ మేరకు మంత్రి రాణా ఖచ్చితంగా తెలియజేసారు.

కతువా, సాంబా జిల్లాలు కరువు పీడిత ప్రాంతాల్లోని.. ఈ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక ఈ షాపుర్ కండి ప్రాజెక్టు పూర్తయితే పంజాబ్‌లో 5,000 హెక్టార్లు, జమ్మూ కాశ్మీర్‌లోని కతువా, సాంబా జిల్లాల్లో 32,173 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. దానితో పాటు ఈ ప్రాజెక్ట్ ద్వారా పంజాబ్ లో 206 మెగావాట్ల జల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడానికి వీలుంది.

ఏప్రిల్ నుండి పాకిస్తాన్‌కు మిగులు రావి నీటి ప్రవాహాన్ని ఆపడానికి భారతదేశం మార్చి 31 నాటికి షాపూర్ కంది బ్యారేజీని సిద్ధం చేస్తుంది

ఇక జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ తాజాగా పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఈ పరిశీలన రక్షణ శాఖ ఆ సమయంలో అధికారికంగా ప్రకటించింది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular