తెలంగాణ
ఓయ్-చంద్రశేఖర్ రావు
జనాభా లెక్కల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2027లో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ ఇది. దీనికోసం దాదాపు 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించనున్నారు. ఇది పూర్తిగా దేశంలో డిజిటల్ పద్ధతిలో జరిగే తొలి జనాభా గణన కావడంతో ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు ప్రారంభించింది. సకాలంలో కార్యాచరణ ప్రణాళిక, బాధ్యతలపై అవగాహన కల్పించడానికి త్వరలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది.
ఈ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ రావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయి జన గణన సమన్వయ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. జిల్లా స్థాయిలో పరిపాలన, లాజిస్టిక్, కార్యాచరణ ఏర్పాట్లను సమీక్షించారు. 2027 జన గణనను విజయవంతం చేయడానికి సమన్వయం అవసరమని, సకాలంలో నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది. దీనికి అన్ని శాఖల సహకారం అందించాలని సూచించారు.

అధికారులకు ఉద్యోగుల తాత్కాలిక అంచనా సిద్ధం చేయడానికి రామకృష్ణ రావు ఆదేశాలు ఇచ్చారు. డిజిటల్ గణనలో మురికివాడలు, మారుమూల ప్రాంతాలన్నీ కవర్ చేయాలని, ఎటువంటి లోటుపాట్లు కూడా ఉండకూడదని అన్నారు. ఈ విషయంలో జనాభా సిబ్బందికి నాణ్యమైన శిక్షణ చాలా ముఖ్యమని ప్రధాన కార్యదర్శి వివరించారు. సెన్సస్ డిజిటల్ విధానంలో లోపాలు తలెత్తకూడదని, మూల గ్రామాలు, తాండాలు, చిన్న చిన్న ఆవాసాలను తీసుకునేటప్పుడు డబుల్ ఎంట్రీలు ఉండకూడదని సూచించారు.
ఈ సందర్భంగా జన గణన డైరెక్టర్ భారతి హోలికేరి మాట్లాడుతూ.. 2027 గణన కోసం తొలి దశలో 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. వీరిలో ప్రధానంగా ఉపాధ్యాయులు ఉంటారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు జనాభా లెక్కింపుదారులు, సూపర్ వైజర్లుగా నియమితులవుతున్నారని ఆమె తెలిపారు.
ఈ సమావేశానికి ఆర్థిక ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నదీమ్ అహ్మద్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా ఛోంగ్తు, ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్, సాధారణ పరిపాలన కార్యదర్శి ఈ శ్రీధర్, మున్సిపల్ కార్యదర్శి టీకే శ్రీదేవి.

