గౌరిగోపాల్ హాస్పిటల్లో 16న ఉచిత మెగా వైద్య శిబిరం
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 15, (సీమకిరణం న్యూస్) :
కర్నూలులోని గౌరిగోపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన కర్నూలు నియోజకవర్గ ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు గౌరి గోపాల్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. ఈ శిబిరంలో సుమారు రూ.6 వేల విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రయోజనం పొందాలని విజ్ఞప్తి చేశారు.

