తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
హైదరాబాద్.. ప్రపంచంలోని మహా నగరాల్లో ఒకటిగా ఉంది. మెట్రో పాలిటిక్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. అలాగే హైదరాబాద్ లో జనాభా రోజు కూడా పెరిగిపోతోంది. 2025లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటి 13 లక్షల 30 వేలుగా ఉంది. 2024 నాటికి 2.43 శాతం పెరుగుదల కనిపించింది. ఇలా ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరుగుతోంది.
అటు జనాభాతో పాటు వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ అన్ని రకాల వాహనాల సంఖ్య చూస్తే 85 లక్షల 22 వేల 286 కు చేరింది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్లో కలిపి ప్రస్తుతం 59 వేల 800 కంపెనీలు ఉన్నాయి. దాంతో హైదరాబాద్ మహా నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయింది. అయితే నగరవాసులకు మెరుగైన, పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాలను కీలక ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఎం ఈ-డ్రైవ్ (ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్ హాన్స్ మెంట్) పథకంలో భాగంగా భాగ్యనగరంలో ప్రజల రవాణా కోసం 915 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాతో పాటు నిర్వహణకు లెటర్ ఆఫ్ అవార్డు లభించింది.

ఈ మేరకు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ప్రాజెక్ట్ అమల్లోకి రానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 915 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 9 మీటర్ల పొడవు ఉన్న 100 నిమిషాల బస్సులు, ప్రధాన మార్గాల్లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి 12 మీటర్ల పొడవు 815 మీటర్ల స్టాండ్ ఫ్లోర్ నాన్-ఏసీ బస్సులు రానున్నాయి. ఇక ఇటీవల హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ఛార్జీలను తగ్గించింది. టికెట్ ధరల్లో మార్పులు చేయనప్పటికీ డిస్కౌంట్ పేరుతో తగ్గింపులు చేపట్టారు.

