Wednesday, March 18, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణహార్ముజ్ నుంచి 2 నౌకలు తెచ్చిన ఎల్పీజీ 2 రోజులు కూడా సరిపోదా ? |...

హార్ముజ్ నుంచి 2 నౌకలు తెచ్చిన ఎల్పీజీ 2 రోజులు కూడా సరిపోదా ? | చిదంబరం హెచ్చరిస్తున్నారు: 2 భారతీయ LPG షిప్‌లు హార్ముజ్‌ను దాటాయి, కేవలం 1.5 రోజుల గ్యాస్ డిమాండ్ కవర్

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-సయ్యద్ అహ్మద్

ఇరాన్ వార్ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని (హోర్ముజ్ జలసంధి) మూసేయడంతో భారత్ సహా పలు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నౌకలు శివాలిక్, నందా దేవీలను వదిలిపెట్టాలని ఇరాన్ ను కేంద్రం కోరడంతో వాటికి విముక్తి లభించింది. దీంతో అవి సురక్షితంగా భారత్ కు చేరుకున్నాయి. వీటిలో మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (LPG) భారత్ కు వచ్చింది. అయితే ఈ ఎల్పీజీ భారత్ లో అవసరాలకు ఎన్ని రోజులకు సరిపోతుందన్న చర్చ.

ఈ నేపథ్యంలో భారత్ లో ఎల్పీజీ డిమాండ్ ఎలా ఉంది, దీన్ని తట్టుకునేందుకు ఈ రెండు ఎల్పీజీ ఎంత నౌకతో పనికొస్తుందో దానిపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం (పి చిదంబరం) ఇవాళ ఓ ట్వీట్ చేశారు. గూగుల్ నుంచి సేకరించిన సమాచారం అంటూ చిదంబరం కొన్ని వివరాలను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇందులో ఆయన ప్రస్తుతం భారత్ లో ఎల్పీజీ డిమాండ్ మేరకు చూసుకుంటే హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చిన రెండు నౌకల్లో ఎల్పీజీ కేవలం 2 రోజులకూ సరిపోదని తేల్చారు.

చిదంబరం హెచ్చరించిన 2 భారతీయ LPG షిప్‌లు హార్ముజ్ కవర్ కేవలం 1 5 రోజుల గ్యాస్ డిమాండ్

2026 మార్చి 14-17 తేదీల నివేదికల ప్రకారం, భారత జెండా కలిగిన రెండు ఎల్‌పిజి నౌకలు, శివాలిక్ మరియు నందా దేవి, మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల టన్నుల ఎల్‌పిజిని తీసుకువెళ్లి హార్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటిందని, ఇందులో రవాణా చేసిన మొత్తం ఎల్‌పిజి: 92,700 మెట్రిక్ టన్నుల మెట్రిక్ టన్నులు (46,000 మెట్రిక్ టన్నులు) ఈ మొత్తం భారత్‌లో మొత్తం వంటగ్యాస్‌లో దాదాపు 1.25 నుండి 1.6 రోజులకు సమానం అని చిదంబరం చెప్పారు. రేపటి కల్లా ఈ గ్యాస్ వాడేయడం ఖాయమని, దీంతో హార్ముజ్ వైపు మళ్లీ నౌకల కోసం ఎదురుచూపులు తప్పవని చిదంబరం చెప్పకనే చెప్పారు.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular