అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతం అయినట్లు ఇజ్రాయెల్ లోని పలు మీడియా ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తను మొదటగా ఇజ్రాయెల్ లోని ఛానెల్ 11లో టెలికాస్ట్ చేసింది. ఆ తర్వాత మీడియా ఛానెళ్లు ఈ వార్తనే టెలికాస్ట్ చేశాయి. అయితే ఖమేనీ హతం అంటూ వస్తున్న వార్తలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఖండించారు. ‘నాకు తెలిసినంత వరకు అయితే ఖమేనీ జీవించే ఉన్నారు’ అని స్పష్టం చేశారు.
ఇక ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన టాప్ కమాండర్ మహమ్మద్ పక్ పూర్ హతం అయినట్లు సమాచారం. అలాగే ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ చీఫ్ ముహమూర్ భగేరీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేనీ సలామీ.. వీరితోపాటు డిఫెన్స్ మంత్రి, మేజర్ జనరల్ అమీర్ హతేమీ కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ దాడుల్లో హతేమీ హతం కాలేదని ఇరాన్ సాధ్యం.
ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా బలగాలు సంయుక్తంగా దాడులు చేపట్టింది. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ ఇంటి వద్దే బాంబులు పేల్చింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ దాడిలో ఖమేనీ ఇళ్లు ధ్వంసం అయినట్లు పూర్తిగా ఉన్నాయి. అయితే అప్పటికే ఖమేనీని సురక్షిత తరలించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఖమేనీతోపాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడ్డారు.

మరోవైపు మధ్య ఆసియా పరిస్థితిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని భారత్ కోరింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచనలు చేసింది. అలాగే ఇరాన్- ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియా ఎయిర్స్పేస్ మూతపడింది. ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్లోనూ ఎయిర్ స్పేస్ ను మూసివేశారు. ఇక దుబాయ్ నుంచి అన్ని విమాన సర్వీసులను ఎమిరేట్స్ నిలిపివేసింది. దాంతోపాటు దుబాయ్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎమిరేట్స్ విమాన సర్వీసులు రద్దయ్యాయి.

