పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు
కల్లూరు, ఆగస్టు 04, (సీమకిరణం న్యూస్) :

పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని కల్లూరు మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) ఆంజనేయులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శాలువాతో సత్కరించి, శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. శుభాకాంక్షలు తెలిపిన తహసీల్దార్ ఆంజనేయులకు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

