ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఏపీలో టీటీడీ చైర్మన్ (ttd చైర్మన్) బీఆర్ నాయుడు (br naidu) ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న పలు వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నిన్న స్పందించిన బీఆర్ నాయుడు అవి డీప్ ఫేక్ వీడియోలని కొట్టిపారేశారు. అనంతరం తన కుటుంబంతో 30 ఏళ్లుగా సన్నిహితంగా ఉన్న మహిళ అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే వీడియోలను మార్ఫింగ్ చేశారంటూ మరో వ్యాఖ్య చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ వైసీపీ మాత్రం ఆ వీడియోలు నిజమేనని పదే పదే చెబుతోంది.
ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తమ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లోనే బీఆర్ నాయుడు బాధితురాలు రాసినట్లు చెబుతున్న ఓ లేఖను విడుదల చేసింది. ఈ లేఖను ఆమె సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పవన్ కు పంపినట్లు వైసీపీ. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా ఈ లేఖలో విషయాలు మాత్రం షాకింగ్ గా ఉన్నాయి. ఈ లేఖను బయటపెట్టిన వైసీపీ.. బీఆర్ నాయుడు వ్యవహారం తెలిస్తే పదవి ఇచ్చారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.

💣 ట్రూత్ బాంబ్ 💣 @ncbn, @పవన్ కళ్యాణ్, @నరలోకేష్ కి లేఖ రాసిన బీఆర్ నాయుడు బాధితురాలు..
బీఆర్ నాయుడికి మహిళలను లోబర్చుకోవడమే పని.. పక్కలోకి రాకపోతే ఏ చిన్న పని కూడా మహిళలకు చేసిపెట్టాడు.
నాతో 30 ఏళ్లుగా సంబంధం పెట్టుకుని.. ఆర్థికంగా, మానసికంగా వేధిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న… pic.twitter.com/oF3WFglmj1
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (@YSRCPparty) మార్చి 2, 2026
ఈ లేఖలో బాధితురాలు.” అని రాసినట్లు వైసీపీ ట్వీట్ లో చేసింది. కాబట్టి వెంటనే రాజీనామా ఆయన్ను డిమాండ్ చేసింది.

