అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని కొద్దిసేపటికే మోదీ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ లో ల్యాండ్ అయ్యారు. 9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ గడ్డపైపెట్టిన ప్రధాని మోదీకి ఘన అడుగు స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రోటోకాల్ పక్కనపెట్టి తన సతీమణి సారాతో కలిసి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అయితే ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్ పర్యటన ఇప్పుడు పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
అయితే ఈ పర్యటనలో భారత్- ఇజ్రాయెల్ మధ్య ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI), డిఫెన్స్, సాంకేతిక, వ్యూహాత్మక రంగాల్లో పలు ఒప్పందాలు జరుగుతున్నాయి. భారత్-ఇజ్రాయెల్ మైత్రిని ‘హెక్సాగన్ ఆఫ్ అలయన్స్’ గా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభివర్ణిస్తున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ పార్లమెంట్ లో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘హెక్సాగన్ ఆఫ్ అలయన్స్’ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని దేశాలు కూటమిగా మారాలని అన్నారు. ఇందులో భారత్, అరబ్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, మెడిటేరియన్ దేశాలు(గ్రీస్, సిప్రస్), అలాగే ఆసియాలోని పలు దేశాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే ఈ గురించి ఇప్పుడే పూర్తిగా వెల్లడి కూటమికాదని.. సమయం ప్రకారం దీనికి సంబంధించిన విషయాలు తాను వెల్లడిస్తానని అన్నారు.
మిడిల్ ఈస్ట్ దేశాల్లో క్రమంగా పెరుగుతున్న తీవ్రవాద శక్తులను ఎదుర్కోవడం. ముఖ్యంగా ఇరాన్ ఆమోదని షియా, సున్నీ తీవ్రవాద గ్రూపుల ప్రభావం తగ్గించడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశ్యం అని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఈ ‘హెక్సాగన్ ఆఫ్ అలయన్స్’ లో భారత్ ను కలపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ సెనెట్ దీనిని వ్యతిరేకిస్తూ రిజల్యూషన్ పాస్ చేసింది. ఈ ప్రాంతీయ శాంతికి అలాగే స్థిరత్వ కూటమికి విఘాతం కలిగిస్తుందని ఆరోపించింది.

భారత్ మరోవైపు- ఇజ్రాయెల్ మైత్రిని పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఏమాత్రం జీర్ణించుకోవడం లేదని స్పష్టం అవుతోంది. వీరి మైత్రి ఇస్లామిక్ దేశాలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని మునీర్ ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది. భారత్తో పాటు సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్తో సంబంధాలను పెంచుతున్న నేపథ్యంలో ఇప్పుడు పాకిస్థాన్ ఒంటరి అవుతుందన్న అసిమ్ మునీర్, పాక్ పాలసీలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

