ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు. నినాదాలు.. నిరసనలు చేసారు. గవర్నర్ ప్రసంగం సమయంలోనే వాకౌట్ చేసారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సాధించిన ప్రగతిని.. లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. కాగా, ఆ తరువాత సమావేశమైన బీఏసీ అసెంబ్లీ నిర్వహణ.. అజెండాపై నిర్ణయం తీసుకున్నారు. కీలక అంశాల పైన సభ నుంచే స్పష్టత ఇవ్వబడింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల వేదికగా ప్రస్తుతం కీలకంగా మారిన అన్ని అంశాల పైన చర్చించండి… ప్రజలకు స్పష్టత అందుబాటులో డిసైడ్ అయింది. అదే పాలనాపరంగానూ కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సారి సమావేశాలను 17 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 14న ప్రభుత్వ సభలో 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఆ తరువాత 15,16 తేదీలు శివరాత్రి.. ఆ మరుసటి రోజు సెలవులు. 17, 18 తేదీల్లో బడ్జెట్ పైన చర్చ జరగనుంది. 18న బడ్జెట్ పై ఆర్దిక మంత్రి సమాధానం ఇవ్వను. వరుసగా ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ పద్దుల పైన శాఖల వారీగా చర్చించండి… కేటాయింపులు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్లకు ఆమోదం తెలపనుంది.

అసెంబ్లీ వేదికగా కీలక అంశాలపై చర్చ
ఇక, ఫిబ్రవరి 24,25,26 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీల నిర్వహణకు బీఏసీలో నిర్ణయం జరిగింది. మార్చి 1,2,3 తేదీల్లో సెలవులు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 2 గంటల వరకు సభ నిర్వహించనున్నారు. అదే విధంగా తప్పని సరిగా సమావేశాల్లో ప్రతీ రోజు 10 గంటలకు జీరో వారు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అవసరమైతే పొడిగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక, సమావేశాల ముగింపు రోజు మార్చి6న అమరావతిలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్పీకర్ నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమంతో పాటుగా ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల గురించి సభా వేదికగా ప్రజలకు వివరించాలని. తాజా వివాదాలు.. ప్రభుత్వం పైన వస్తున్న విమర్శలకు అసెంబ్లీ నుంచే స్పష్టత ఇవ్వనున్నారు. మెడికల్ కాలేజీలతో సహా… రుషికొండ పైనా సభలో చర్చించే అవకాశం ఉందని. దీంతో… ఈ సారి సమావేశాలు మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది.

