టిప్పర్ కు భారీ జరిమానా విధించిన ఆర్టీవో క్రాంతి కుమార్
డోన్ టౌన్, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్):
మండలంలోని 44వ జాతీయ రహదారిపై ఆర్టీవో క్రాంతి కుమార్ బుధవారం జరిపిన సాధారణ తనిఖీల్లో భాగంగా డోన్ నేషనల్ హైవే 44 దత్తాత్రేయ గుడి వద్ద ఒక టిప్పర్ AP26TF0219 ను ఆపి తనిఖీ చేయడం జరిగినది. రెండు సంవత్సరాలుగా ఫిట్నెస్ మరియు మూడు సంవత్సరాల నుండి రోడ్ టాక్స్ కట్టకుండా వెల్దుర్తి వద్ద రైల్వే కాంట్రాక్టు వర్క్ చేస్తునట్టు గుర్తించి ₹2,45,000/- (రెండు లక్షల నలభైఅయిదు వేల రూపాయలు) జరిమానా విధించారు. అనంతరం డోన్ ఆర్టీసీ డిపోకు తరలించారు.

