అభివృద్ధి, సంక్షేమమే కూటమి లక్ష్యం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కానూరు, తులసినగర్, యనమలకుదురులో నూతన వెల్నెస్ సెంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్కో కేంద్రానికి రూ.26 లక్షలు కేటాయించామన్నారు. 8 మంది సిబ్బందితో సుమారు 150 రకాల వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కృష్ణా నది నుంచి తాగునీటి కోసం రూ.400 కోట్లు కేటాయించామని తెలిపారు.

