తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
అసెంబీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 1, 2023 నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ 1 కోటి 6 లక్షల 56 వేల 674 రూపాయలు జీతభత్యాలు పొందారని అన్నారు. విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నాను.
“అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని అనుకున్నాం. కొత్త గవర్నర్కు శుభాకాంక్షలు చెబుతారని భావించాం. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా… కొందరిలో రాచరిక పోకడలు లేవు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
“కొందరు ఇంకా తాము రాజులుగా ఉన్నారు. ప్రజలే తప్పు చేశారని అనుకుంటున్నారు. నియంత పోకడలను నిరంతరం ప్రజాస్వామ్య అపహాస్యం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ప్రజలు బుద్ధిచెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఇప్పుడూ అదే తీరుగా ప్రవర్తిస్తున్నారు” అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
“తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిభింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల గొప్పగా ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, విజన్ను ఆవిష్కరిస్తూ… రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన చరిత్రాత్మక వ్యవస్థ. ఆయన చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. ఎదగడానికి అవసరమైన విశిష్ఠ ప్రణాళిక. అటువంటి గొప్ప సంకల్పాన్ని, పవిత్ర శాసన సభ వేదిక నుండి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శుక్లా గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
“గత చరిత్రను అనుభవపూర్వకంగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించాలని గవర్నర్ ప్రసంగంలో వివరించారు. సంక్షోభ సమయంలో దేశ ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు చేపట్టారు. ఆయన తీసుకున్న ప్రణాళికలతోనే ఇవాళ ఈ దేశం ఈనాడులో ఉంది. సీఎం మొదటి తరంలో నెహ్రూ- ఇందిరా గాంధీ గొప్ప విధానాలు తీసుకువచ్చారు. పేర్కొన్నారు.
“భవిష్యత్తులో ఏఐ సునామీ రాబోతుంది. దీనిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు. ఒక పాలసీ డాక్యుమెంట్ ను గవర్నర్ గారి ప్రసంగంలో వివరించారు. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను కనీసం చదివారా? చూశారా..? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే నాంది పలుకడానికి అంగీకరించాల్సిన అవసరం లేదు”. వరకు.
“అందుకే ఎవరు అడ్డుపడ్డా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. అన్ని రంగాల మేధావులతో కలిసి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించుకున్నాం. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్గా విభజించుకున్నాం. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమాన్ని నిర్ధాక్షిణ్యంగా కొట్టిపారేయాలని ఎలా మాట్లాడుకున్నాం? భగాయత్ లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూసొద్దాం రండి ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం..”

“కాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించవచ్చు. త్వరలో క్యూర్లోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈ వాహనాలను మార్చబోతున్నాం. మన నగరాన్ని మనం రక్షించుకోకపోతే, చెరువులను పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరం మనల్ని క్షమించదు” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

