అంతర్జాతీయ
-కొరివి జయకుమార్
ఉత్తర కొరియాలో కిమ్ కుటుంబం అధికారంపై పట్టు బిగిస్తోంది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్కు కీలక పదోన్నతి లభించింది. వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా జరిగిన ఈ పరిణామం కిమ్ పాలన బలపడుతుందన్న సంకేతాలు వస్తున్నాయి.
కేసీఎన్ఏ ప్రకారం.. కిమ్ యోంగ్ గతంలో వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ వైస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉండగా, ఇప్పుడు ఆమెను ఓ స్టేషన్ డైరెక్టర్గా నియమించారు. అయితే ఆ విభాగంపై ఇంకా స్పష్టత లేదు. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కాంగ్రెస్లో కిమ్ జోంగ్ ఉన్ జనరల్ సెక్రటరీగా తిరిగి ఎన్నికయ్యారు.

మరోవైపు, కిమ్ జోంగ్ ఉన్ వారసురాలిగా టీనేజ్ కుమార్తె కిమ్ జు ఏను సిద్ధం చేయడానికి దక్షిణ కొరియా గూఢచార సంస్థ ఇటీవల అంచనా వేసింది. ఇది నిజమైతే 1940ల నుంచి కొనసాగుతున్న కిమ్ కుటుంబ పాలన భవిష్యత్తులో కొనసాగనుంది.
కిమ్ కుటుంబ సభ్యుల జీవితాలు విషాదకరంగా ముగిసినందున కిమ్ యో జోంగ్ ఉన్నత స్థానానికి చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ను 2017లో కిమ్ జోంగ్ ఉన్ హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి.
పార్టీ కాంగ్రెస్ సమావేశాల్లో దేశ దీర్ఘకాలిక లక్ష్యాలపై చర్చిస్తున్నట్లు కేసీఎన్ఏ విడుదల చేసింది. అమెరికాతో విధానం, అణ్వస్త్ర ప్రణాళికలపై కిమ్ జోంగ్ ఉన్ వివరాలు వెల్లడించలేదు. అణు యుద్ధ నిరోధక శక్తి బలపరిచే ప్రణాళికలను గురించి ఆయన గత నెలలో చెప్పారు.

