Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఅసెంబ్లీకి వైసీపీ స్పీకర్, అనూహ్య నిర్ణయం..!! | బడ్జెట్ సమావేశాల మధ్య సభకు సభ్యుల హాజరు...

అసెంబ్లీకి వైసీపీ స్పీకర్, అనూహ్య నిర్ణయం..!! | బడ్జెట్ సమావేశాల మధ్య సభకు సభ్యుల హాజరు నమోదుపై అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం, వివరాలు ఇక్కడ ఉన్నాయి

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అవుతున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభిస్తారు. వైసీపీ ఈ రోజు సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ భేటీలో సమావేశాల నిర్వహణ అజెండా పైన నిర్ణయించనున్నారు. కాగా.. ఇదే సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల హాజరు వివాదం వేళ ఈ నిర్ణయం ఆసక్తిగా మారుతోంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దమైంది. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14న 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టనుంది. తొలి రోజు సమావేశాలకు మాజీ సీఎం జగన్ సహా..వైసీపీ సభ్యులంతా సభకు హాజరు కానున్నారు. ఇదే సమయంలో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల నుంచి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్ విధానంలో సభ్యుల హాజరు నమోదు చేయనున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకారం సమావేశాలు ప్రారంభమయ్యే బుధవారం నుంచే ఈ విధానం అమల్లోకి తెస్తున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు. డిజిటల్‌ విధానం అమలులో ఉన్న నేపథ్యంలో ఇకపై సభ్యులు హాజరు పట్టికలో సంతకం చేయనవసరం లేదని, దానిని తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా బయట రిజిస్టర్‌లో సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకుంటుండడంపై చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ-స్పీకర్-కీలక-నిర్ణయం-సభ్యుల-హాజరు-రిజిస్టర్-ఇంట్లో-బడ్జెట్-సెషన్స్-de

సభ్యుల హాజరు ఇక నుంచి

కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన శాసనసభ స్పీకర్ 86వ అఖిల భారత మహాసభలోనూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దీనిని ప్రస్తావించారు. అసెంబ్లీకి రాణి సభ్యులకు ‘నో వర్క్‌.. నో పే’ విధానాన్ని అమలు చేస్తే, అవసరమైతే రైటు రీకాల్‌ అమలు చేయాలని స్పీకర్ సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా అమలు చేయనున్న డిజిటల్‌ విధానంతో వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా నిర్ణయంతో ఇక నుంచి సభలో సభ్యులు వారికి కేటాయించిన కుర్చీలో కూర్చున్న తర్వాతే.. ఏఐ ఆధారిత డిజిటల్ విధానం సంబంధిత సభ్యుడి హాజరును నమోదు చేసుకోండి. ఈ కారణంగా గతంలో మాదిరి సభకు ఆలస్యంగా వచ్చి సమావేశాలు ముగియకముందే వెళ్లిపోవడానికి ఆస్కారం ఉండదు. సభ్యుల సభలో ఎంత సమయం ఉన్నారనే విషయాన్నీ తెలుసుకోవచ్చు. ఏఐ ఆధారిత హాజరు విధానంలో అత్యాధునిక ఫేస్‌ రికగ్ననైజేషన్ టెక్నాలజీని వినియోగిస్తారు. సభలో పీటీజెడ్(పాన్.. టిల్ట్.. జూమ్) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ నిర్ణయం పైన సమావేశాల ప్రారంభం వేళ ఆసక్తి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular