భారతదేశం
-బొమ్మ శివకుమార్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన జీవితాన్ని, విలువలను తీర్చిదిద్దిన మహిళల గురించి పంచుకున్నారు. మార్చి 8న అహ్మదాబాద్ నుంచి లింక్డ్ఇన్లో పంచుకున్న సందేశంలో, వారిని తన “నా మనస్సాక్షి యొక్క వాస్తుశిల్పులు” (నా మనస్సాక్షి నిర్మాతలు) అని అభివర్ణించారు. ఈ మహిళల ప్రభావం తన జీవిత దృక్పథం, బాధ్యత, దేశ నిర్మాణంపై ఎంతగానో ఉందని ఆయన పేర్కొన్నారు.
గౌతమ్ అదానీ.. తన తల్లి, సతీమణి ప్రీతి అదానీ, కోడళ్లు పరిధి అదానీ, దివ్య షా, తన మనవరాళ్ళను తన విలువలపై చూపిన మహిళలుగా పేర్కొన్నారు. జీవితం పట్ల బాధ్యత, దేశ నిర్మాణ ఆలోచనలను పెంపొందించడంలో వారి మార్గదర్శకత్వాన్ని అదానీ ఎంతో ప్రశంసించారు.
బాల్యంలో తన తల్లి నుంచే తొలి జీవిత పాఠాలు నేర్చుకున్నానని గౌతమ్ అదానీ గుర్తుచేసుకున్నారు. ఆమె భారతీయ ఇతిహాసాలను, వాటిలోని విలువలను తనకు పరిచయం చేశారు. పాఠ్యపుస్తకాల కంటే లోతైన నీతిని బోధించిన ఆ కథలు ధైర్యం, త్యాగం, కర్తవ్యం, శాశ్వత విశ్వాసం వంటి భావనలను తనలో నింపాయని ఆయన వివరించారు.
తన యవ్వనంలో ఒక కీలక సందర్భాన్ని అదానీ ప్రస్తావించారు. 16 ఏళ్ల వయసులో ముంబైలో అవకాశాల కోసం ఇంటిని విడిచి వెళ్లినప్పుడు, తన తల్లి ఎంత ధైర్యం చేసిందో తరచుగా ఆలోచిస్తానని ఆయన అన్నారు. దృఢ సంకల్పం తప్ప మరేమీ లేకుండా ఒక అనిశ్చిత భవిష్యత్తులో అడుగు పెట్టడానికి ఆ తల్లి చూపిన విశ్వాసం గొప్పదని అదానీ పేర్కొన్నారు.
తన సతీమణి ప్రీతి అదానీకి కూడా ఆయన నివాళులర్పించారు. ఆమెను తన “keeper of my conscience” (నా మనస్సాక్షి సంరక్షకురాలు)గా అభివర్ణించారు. అర్హత కలిగిన దంత వైద్యురాలు అయిన ప్రీతి అదానీ, అదానీ ఫౌండేషన్ నిర్మాణం కృషిని అంకితం చేశారు. ఈ ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, సుస్థిర జీవనోపాధి, సామాజిక అభివృద్ధి రంగాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అదానీ ఫౌండేషన్ కార్యక్రమాలు విశేషంగా విస్తరించాయి. ఈ కార్యక్రమాలు ప్రస్తుతం భారతదేశంలోని 22 రాష్ట్రాలలో 10 మిలియన్ల (కోటి) మందికి పైగా ప్రజల జీవితాలపై సానుకూల ఫలితాలు చూపిస్తున్నాయి. నిస్వార్థ సేవ, సామాజిక బాధ్యత పట్ల ప్రీతి అదానీ నిబద్ధతకు ఇది నిదర్శనమని అదానీ సంతోషం వ్యక్తం చేశారు.

అదానీ తన కోడళ్ళు పరిధి అదానీ, దివ్య షా ల గురించి కూడా ప్రస్తావించారు. పరిధిని ఆలోచనాత్మకమైన, చురుకైన న్యాయవాదిగా, అనేక విషయాలపై పట్టున్న వ్యక్తిగా ఆయన పేర్కొన్నారు. దివ్య షాను అత్యంత సృజనాత్మకంగా ప్రశంసించారు. దివ్యాంగులకు మద్దతునిచ్చే ఆమె పనిలో దయ, కరుణ ప్రతిబింబిస్తుంది.
తన ముగ్గురు మనవరాళ్ల వల్ల కలిగే సంతోషం గురించి గౌతమ్ అదానీ మాట్లాడారు. వారి ఉనికి బోర్డురూమ్ చర్చల తీవ్రతను తగ్గించి, ప్రతి తరం భవిష్యత్ తరాల పట్ల మోయాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. ఒక వ్యక్తి ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలు, వ్యాపారాలను నిర్మించినా, కుటుంబంతో గడిపే క్షణాలు లోతైన ఆశయాన్ని అందిస్తాయి.
తన జీవితాన్ని, ఆలోచనగా తీర్చిదిద్దిన ఈ మహిళలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గౌతమ్ అదానీ తన సందేశాన్ని ముగించారు. జీవితంలో అత్యంత బలమైన పుళ్ళు కాంక్రీట్ లేదా ఉక్కుతో కాదు, కానీ మనల్ని తీర్చిదిద్దే వ్యక్తుల ద్వారానే ఏర్పడతాయని ఆయన ఉద్ఘాటించారు. ఇది ఆయన కుటుంబ విలువలు, మానవ సంబంధాల పట్ల తన దృక్పథాన్ని స్పష్టం చేస్తుంది.

