ఆంధ్ర ప్రదేశ్
ఓయి-లింగారెడ్డి గజ్జల
ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు అప్పుడే తన విశ్వరూపాన్ని చూపించాడు. గత వారం రోజులుగా ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్లో కనిపించాల్సిన ఉష్ణోగ్రతలు ఈసారి ఫిబ్రవరిలోనే జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ గడ్డపై ఎండల మంటలు మొదలయ్యాయి.
నంద్యాల కడప, అనంతపురం జిల్లాలో నిన్న ఉష్ణోగ్రతలు 38°C నుండి 40°C మధ్య నమోదవ్వడం విశేషం. ఇది సాధారణం కంటే చాలా ఎక్కువ అని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి 14 రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల్లో నంద్యాల (34.6°C) అగ్రస్థానంలో నిలిచింది.

ట్రోపో ఆవరణంలో గాలుల దిశ మారడమే ఈ వేడికి ప్రధాన కారణమని సూచిస్తుంది. ఉత్తరాంధ్రలో ఉత్తర/ఈశాన్య గాలులు వీస్తుండగా, రాయలసీమ మరియు దక్షిణ కోస్తాలో తూర్పు గాలుల ప్రభావం పెరిగింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా పొడిబారిపోయింది.
Weather: పగలు సెగలు.. రాత్రి చలి!
ప్రస్తుత సీజన్లో ఒక వింత పరిస్థితి ఏర్పడింది. పగటిపూట ఎండలు మండుతుంటే, రాత్రివేళల్లో మాత్రం చలి వణికిస్తోంది.
- రాయలసీమలో: కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పడిపోయే అవకాశం ఉంది.
- ఉత్తరాంధ్రలో: రాబోయే రెండు చలి తీవ్రత 2-3 డిగ్రీలు తక్కువగా ఉండవచ్చు.
- తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల పొగమంచు కూడా కమ్ముకుంటోంది.
వైద్యుల హెచ్చరిక
వాతావరణంలో వస్తున్న ఈ ఆకస్మిక మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ వేడి గాలులు వీస్త డీహైడ్రేషన్కు అవసరమైన ప్రమాదం ఉంది.
ముఖ్య జాగ్రత్తలు:
- మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య అనవసరంగా బయటకు వెళ్లకండి.
- మంచినీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.
- వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో అదనపు జాగ్రత్తలు అవసరం.
మొత్తానికి, ఏపీలో ఎండల సీజన్కు రంగం సిద్ధమైంది. మున్ముందు ఈ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో జనం ఇప్పుడే జాగ్రత్త పడటం మంచిది.

