కేఈ శ్యామ్ బాబు గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం
-: గోవర్ధనగిరి.. చెర్ల కొత్తూరు వైసీపీ నాయకుల చేరిక
-: పార్టీ కండువా వేసి ఆహ్వానించిన కేఈ శ్యామ్ బాబు
క్రిష్ణగిరి, ఫిబ్రవరి 28, (సీమకిరణం న్యూస్) :
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యామ్ బాబును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గోవర్ధనగిరి చెర్ల కొత్తూరు గ్రామ నాయకులు పేర్కొన్నారు. బుధవారం వెల్దుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ గోపాల్ మరియు 30 కుటుంబాలు క్రిష్ణగిరి మండల పరిధిలోని కంబాలపాడులో కేఈ శ్యామ్ బాబు సమక్షంలో వారు తెలుగు దేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కేఈ శ్యామ్ బాబు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. వెంకటేష్, రామదాసు, గోవర్ధనగిరి వార్డు మెంబర్ రాజు, తెలుగు కృష్ణ, మధు, రంగడు, మద్దిలేటి, సూరి తదితరులు పార్టీలో చేరిన వారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సూదేపల్లి జయరాముడు, సిద్ధన గట్టు వెంకటేశ్వర్లు, అమ్మకు తాడు వీరభద్రుడు, క్రిష్ణగిరి శ్రీరాములు, నవ్వి తదితరులు పాల్గొన్నారు.