ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఒక సారి ఇచ్చిన అవకాశం మరి కొంత కాలం పొడిగించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం సైడ్ అయింది. గతంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగియడంతో.. ఇప్పుడు మరోసారి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ స్కీమ్ను మరోసారి అమల్లోకి తీసుకొస్తూ తాత్కాలికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
స్థలాల క్రమబద్దీకరణ కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది పాటు అవకాశం కల్పించింది. అయితే, అనేక మంది ఆ సమయంలో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయారు. స్కీమ్పై సరైన అవగాహన లేకపోవడం, ఇంకా ఇతర భయాలతో దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఏడాది మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించాలని పార్టీ నేతల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం మరోసారి నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది.

అంటే, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు, ఇంకా పూరిపాకలు, తాత్కాలిక షెడ్లు వేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. చెరువులు, కుంటలు, కాలువ, చెరువు పోరంబోకు, డిఫెన్స్, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలతో ముడిపడిన భూముల్లో క్రమబద్ధీకరణకు అవకాశం ఉండదు. నివాస యోగ్యమైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేని పక్షంలోనే క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు.
మార్గదర్శకాలు జారీ
అందులో భాగంగా ఈ మేరకు అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టేందుకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (ఎల్ఏ) చర్యలు చేపట్టింది. తాజాగా భూముల క్రమబద్ధీకరణలో విశాఖ జిల్లా గాజువాకకు మరో స్కీమ్ను ప్రభుత్వం పునరుద్ధరించింది. గాజువాక గ్రామ పరిధిలో అభ్యంతరం లేని భూముల్లో ఇంటి నిర్మాణం చేసుకుంటే వెయ్యి చదరపు గజాల వరకు క్రమబద్ధీకరణకు అనుమతించాలని నిర్ణయించారు.
క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఈ ఏడాది జూన్ 30 వరకు స్వీకరించాలని తాజా అనుమతిని నిర్దేశించింది. జీవో నం. 45 ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియ జరుగుతుంది. ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం పేదలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఈ పథకం గురించి అవగాహన పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

