ఆంధ్ర ప్రదేశ్
ఓయి-లింగారెడ్డి గజ్జల
కల్తీ నెయ్యి సరఫరా ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ సంస్థతో ముడిపెట్టి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని సీఎం చంద్రబాబు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన విస్తృతంగా మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన సమన్వయంతో పనిచేశాయని తెలిపారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో అనేక సంఘటనలు ప్రజలను బాధించాయని, అసెంబ్లీలో గతంలో పాలకుల ప్రవర్తన తనను వ్యక్తిగతంగా కలచివేసిందని సీఎం అన్నారు. తాను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని, తనలాంటి అనేక మంది ప్రజలు కూడా ఆ కాలంలో తీవ్ర వేదన అనుభవించారని. విశాఖపట్నంలో పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ను గుర్తుచేసి, గతంలో ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకున్నవారే ఇప్పుడు నీతులు చెబుతున్నారని అన్నారు. ప్రజలు ప్రతి గమనిస్తూ సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

తప్పులను బయటపెట్టకుండా ఉంటే..
శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు తగిన విధంగా. తిరుపతి లడ్డూ వ్యవహారం అత్యంత సున్నితమైన అంశమని, కొందరు కావాలనే దేవాలయ పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నించారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక్కసారైనా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా భావిస్తున్నారని గుర్తుచేశారు. జరిగిన తప్పులను బయటపెట్టకుండా ఉంటే అపవిత్రత కొనసాగుతుందని.
అవాస్తవ కథనాలు..
టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం బాధ్యత పూర్తి చేస్తుందని తెలిపారు. కల్తీ నెయ్యి సరఫరా ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ సంస్థతో ముడిపెట్టి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. హెరిటేజ్ కుటుంబ ఆధారిత వ్యాపారమని, దాని బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నారని.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, ఆ ఘటనలో అనేక నాటకాలు ఆడారని సీఎం అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలను ఇతరులకు తప్పించుకునేందుకు మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయని. సాక్షిపత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాశారని. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల భాగంగా ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడానికి చర్యలు తీసుకునేవారని, అదే ధోరణి ఇప్పుడు కూడా కనిపిస్తోందని అన్నారు.
మద్యం వ్యవహారంలో గత పాలనలో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని. రూ.3,200 కోట్ల మేర మద్యం కుంభకోణం తెలిసింది. ఆ అంశంపై కోర్టులు కూడా సీరియస్గా తీసుకున్నాయని చెప్పారు. ప్రస్తుతం హోలోగ్రామ్, బ్యాచ్ నంబర్ వంటి భద్రతా ఫీచర్లతో నకిలీకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్ర పునర్నిర్మాణం, శాంతిభద్రతల పరిరక్షణ, దేవాలయాల పవిత్రత కాపాడటం, అవినీతి ఆరోపణలపై చర్యలు – ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో తెలిపారు.

