ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
తమిళనాడు రాజకీయాల్లో పవన్ కీలక మంత్రాగం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ తొలి సారి బరిలోకి దిగుతున్న ప్రముఖ హీరో విజయ్ పార్టీ టీవీకే ను ఎన్డీఏలోకి తీసుకొచ్చేందుకు పవన్ రంగంలోకి దిగారు. తన సహచర విజయ్ తో ఈ మేరకు మంత్రాంగం సాగిస్తున్నట్లు చూపుతున్నారు. ప్రస్తుతం కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ రెండో సారి నోటీసుల వేళ.. ఢిల్లీకి వెళుతున్న విజయ్.. అక్కడ ఎన్డీఏ కీలక నేతలతో భేటీ కా సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కీలక భూమి చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి పవన్ తమిళనాడు రాజకీయాల్లో కీలక సమీకరణలకు తెర తీశారు. త్వరలో తమిళనాడు లో ముక్కోణపు పోటీ పోటీ. ఇప్పటికే బీజేపీ నాయకత్వం అన్నా డీఎంకేతో జత కట్టింది. అధికారంలో ఉన్న డీఎంకే తిరిగి తమదే అధికారం అనే ధీమాతో ఉంది. భారీ ప్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీవీకే అధినేత విజయ్ తొలి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ను దగ్గరకు చేసుకునేందుకు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ కూటమిలు ప్రయత్నాలు చేశాయి. అయితే, విజయ్ మాత్రం తాను సింగిల్ గానే పోటీ చేస్తానని పదే పదే చెబుతూ వచ్చారు. ఇక.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ లెక్కలు మారుతున్నాయి. అన్నా డీఎంకేలో పని చేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడు డీఎంకే గూటికి చేరారు. డీఎంకే తిరిగి అధికారంలోకి ఖాయమనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.

విజయ్ ఢిల్లీ పర్యటన వేళ కీలక పరిణామాలు
దీంతో, బీజేపీ నాయకత్వం ఏపీ డిప్యూటీ సీఎం.. ఎన్డీఏ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ ను రంగంలోకి దింపింది. గతంలోనూ విజయ్ పార్టీ ఏర్పాటు పైన పవన్ సానుకూలంగా స్పందించారు. అటు డీఎంకే నాయకత్వం పైన మాత్రం పలు విమర్శలు చేసారు. తమిళనాడు ఎన్డీఏకు అనుకూలంగా పవన్ ప్రచారం చేస్తారనే వాదన ఉంది. ఈ సమయంలోనే విజయ్ తో పవన్ ఎన్డీఏ లోకి ఆహ్వానిస్తూ చర్చలు తమిళ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అటు జనసేన.. ఇటు టీవీకే పార్టీలు ఎక్కడా ఈ విషయాన్ని నిర్ధారించడం లేదు. ఇక, కరూర్ తొక్కిసలాట కేసులో రెండో సారి సీబీఐ నోటీసులు అందుకున్న విజయ్ రేపు (మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలోనే ఎన్డీఏలోని ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పవన్ సైతం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో… ఇప్పుడు పవన్ – విజయ్ ఈ వార్తల పైన ఎలాంటి స్పష్టత ఇస్తారు… విజయ్ ఎన్డీఏలోకి వెళ్లడం ఎంత వరకు జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.

