తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో భారీ ఆపరేషన్ చేశారు. 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 104 మంది నిందితులను అరెస్టు చేసింది సైబర్ క్రైమ్ విభాగం. నిందితులుగా మ్యూల్ ఖాతాదారులు, సరఫరాదారులు, బ్యాంకు అధికారులు ఉన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోలతో నేరాలకు పాల్పడుతున్నవాళ్లు, డిజిటల్’ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలు ఉన్నాయి. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నగదు సీజ్ చేశారు. అలాగే 152 బ్యాంకు పాస్ పుస్తకాలు, 26 ల్యాప్ టాప్లు, 204 సెల్ఫోన్లు, 141 సిమ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆపరేషన్ ఆక్టోపస్
హైదరాబాద్ పోలీసులు భారీ అణిచివేతలో పాన్-ఇండియా సైబర్ ఫ్రాడ్ సిండికేట్ను కూల్చివేశారు
16 రాష్ట్రాల్లో 104 మందిని అరెస్టు చేశారు
మ్యూల్ ఖాతాదారులు, ఖాతాల సరఫరాదారులు, బ్యాంకు అధికారులు సహకరించినందుకు పట్టుబడ్డారు
₹36 లక్షల నగదు & 200+ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు
ది… pic.twitter.com/dzor3ONjah
— VC సజ్జనార్, IPS (@SajjanarVC) ఫిబ్రవరి 24, 2026
మొత్తం 104 మందిని అదుపులోకి తీసుకోగా.. ఇందులో 86 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు (తమ బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇచ్చే వారు), 17 మంది అకౌంట్ సప్లయర్లు, ఓ బ్యాంక్ అధికారి ఉన్నారు. నిందితులు సుమారు 151 బ్యాంక్ ఖాతాల ద్వారా బాధితుల సొమ్మును దారి మళ్లించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా నమోదైన 1,055 సైబర్ కేసులతో వీరికి సంబంధం ఉన్నట్లు తేలింది. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయక ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. దీంతో ఈ రోజు తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ పేరు మీదుగా చర్యలు చేపట్టారు.

ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ వర్క్ ఆపరేట్ చేస్తూ మోసాలకు నెట్టలు గుర్తించబడ్డాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, హరియాణా వంటి రాష్ట్రాలను పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు 32 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఆపరేషన్ ఆక్టోపస్ జరిగింది. ఈ ముఠా సుమారు రూ. 127 కోట్ల మేర సైబర్ మోసాలకు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

