Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపవన్ కళ్యాణ్ కు వీరంతా పొలిటికల్ ప్రొడ్యూసర్లు..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! | పవన్ కళ్యాణ్ కు...

పవన్ కళ్యాణ్ కు వీరంతా పొలిటికల్ ప్రొడ్యూసర్లు..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! | పవన్ కళ్యాణ్ కు రాజకీయ నిర్మాతలు ఇంతమంది జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెద్ద అహంకారి అని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పి తీరా సమయానికి రద్దు చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కనీసం డిపాజిట్లు దక్కవనే భయంతోనే ఈ నెల 7, 8తేదీలలో జరగవలసిన పర్యటనను విరమించుకున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ కు వీరంతా ప్రొడ్యూసర్ లు

పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసినా ఇజ్జత్ పోవడం తప్ప వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రొడ్యూసర్ అని, మంత్రి లోకేష్ కో ప్రొడ్యూసర్ అని, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త ప్రొడ్యూసర్ గా తయారయ్యారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

ఇంతమంది పవన్ కళ్యాణ్ కు రాజకీయ నిర్మాతలు అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు

జనసేన ఆంధ్రా పార్టీ, తెలంగాణాలో ఏం పెత్తనం

జనసేన ఆంధ్రా పార్టీ అనిరుధ్ రెడ్డి అక్కడికి వచ్చి తెలంగాణలో పెత్తనం చేయడానికి ఇక్కడి ప్రజలు ఒప్పుకోరు. తెలంగాణ రాష్ట్రం గురించి గతంలో పవన్ కళ్యాణ్ నోరుజారి అని, ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కూడా పట్టించుకోలేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.

సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఓకే కానీ రాజకీయాల్లో కాదు

కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి కారణమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారని గుర్తుచేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, పవన్ కళ్యాణ్ నాడు అన్న మాటలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి.సినిమాల వరకు పవన్ కళ్యాణ్ ఓకే కానీ రాజకీయాలలో కాదన్నారు.

ఆంధ్రా నేతలు ఇక్కడికి వచ్చేది అందుకే

ఆయన నటించిన చిత్రాలను తాము కూడా చూస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే, ఇప్పుడు బీజేపీతో పొత్తు అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా పర్వాలేదు కానీ, తెలంగాణ ప్రజలకు మాత్రం తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆంధ్ర నేతలు కేవలం తెలంగాణలోని భూములు నిధులు కోసమే వస్తున్నారని, ప్రజల పైన ప్రేమతో కాదంటూ అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular