Tuesday, April 21, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ | తిరుమలలో వేసవి సన్నద్ధత మొదలైంది: రాబోయే వేసవి...

తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ | తిరుమలలో వేసవి సన్నద్ధత మొదలైంది: రాబోయే వేసవి సెలవుల్లో సజావుగా, శీఘ్ర దర్శనం

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

తిరుమలలో భక్తుల ప్రదర్శన. శనివారం నాడు 57,682 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,020 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.65 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది.

వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చర్యలు చేపట్టింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికలను రూపొందిస్తోంది. టీటీడీడీ అదనపు కార్యనిర్వహణ సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం జరిగింది. రెండు- మూడు సంవత్సరాల వేసవి డేటాను తీసుకుని సంఖ్య, వేచి ఉండే సమయం వంటి భక్తుల గురించి విస్తృతంగా చర్చించారు.

తిరుమల రోల్స్ అవుట్ సమ్మర్ ప్రిపేర్‌నెస్ సులభతరమైన శీఘ్ర దర్శనం రాబోయే వేసవి సెలవుల సమయంలో

భక్తులకు మెరుగైన సౌకర్యాలు పంపిణీ అన్నప్రసాదం, మంచినీటి నడక దారి భక్తులకు మార్గమధ్యలో షెడ్ల, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ చేయాలని నిర్ణయించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. వసతి సౌకర్యాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయనున్నారు. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు.

వేసవిలో కంట్ మెంట్లు, లైన్లలో సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే క్యూ సమయాన్ని తగ్గించడం, వారికి చాలా త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అదనపు ఈవో తెలిపారు. ఈసారి ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచి, కంపార్ట్ మెంట్లలో రద్దీ, గంటల వారీగా ఇన్-అవుట్ ఫ్లో, వేచి ఉండే సమయాన్ని ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

గత వేసవిలో జూన్ నెలలో సగటున రోజుకు 80 వేల నుంచి 82 వేల మందికి దర్శనం కల్పించామని, అలాగే 2026 జనవరిలో రోజుకు సగటున 74 వేల మందికి దర్శనం కల్పించినట్లు తెలిపారు. ఇది సమర్థవంతమైన సమయ నిర్వహణ, అన్ని విభాగాల సమన్వయంతో సాధ్యమైందని వివరించబడింది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular