Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకుప్పకూలిన తేలికపాటి విమానం- అందరూ ప్రాణాలతో మిగల్లేదు | జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో 7 మంది...

కుప్పకూలిన తేలికపాటి విమానం- అందరూ ప్రాణాలతో మిగల్లేదు | జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో 7 మంది ప్రయాణికులతో కూడిన ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది, అందరూ చనిపోయినట్లు ప్రకటించారు

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

జార్ఖండ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. ఛత్రా జిల్లా సిమారియా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆనందం విమానం. ఓ రోగిని మెరుగైన వైద్య చికిత్స కోసం రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. రాంచీ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం 7:11 నిమిషాలకు టేకాఫ్ అయింది. ఆ కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది.

ఎయిర్ అంబులెన్స్‌లో ఉన్న ఏడుగురూ ఈ ప్రమాదంలో మరణించినట్లు ఛత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ తెలిపారు. సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ ఎయిర్ అంబులెన్స్ రాడార్ నుంచి అదృశ్యమైంది. సిమారియాలోని బరియాతు పంచాయతీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మృతదేహాలు వెలికితీసినట్లు ఎస్డీపీవో శుభం ఖండేల్‌వాల్పేర్కొన్నారు. మృతులను కెప్టెన్ వికాస్ భగత్, కెప్టెన్ సవరాజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చన దేవి, ధురు కుమార్‌గా పేర్కొన్నారు.

జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఏడుగురు ప్రయాణికులతో కూడిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular