తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
ఎన్నికల మున్సిపల్ కౌంటింగ్ వేళ ఒక లేఖ సంచలనంగా మారింది. ఓ పెన్షనర్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం న్యాయం చేయాలని కోరుతూ ఓ లేఖను బ్యాలెట్ బాక్స్లో వేసిన ఓట్ల లెక్కింపు అధికారులు పేర్కొన్నారు. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఎక్కడా అంటూ అందులో పెన్షనర్ ప్రశ్నించారు. తనకు న్యాయంగా రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని వాపోయారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అధికారులు ఈ లేఖను రిటర్నింగ్ అధికారికి అందచేశారు.
ఎన్నికల మున్సిపల్ కౌంటింగ్ వేళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకుండా రేవంత్ సర్కార్ చేస్తున్న జాప్యంపై నిరసన తెలుపుతూ బ్యాలెట్ బాక్స్లో ఓ లెటర్ ప్రత్యక్షమైంది. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఎక్కడా అంటూ అందులో పెన్షనర్లు ప్రశ్నించారు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలోని 47వ వార్డులో జరిగింది. ఓటింగ్లో పాల్గొన్న ఓ వ్యక్తి తన ఓటుతో పాటు ఒక లేఖను కూడా బ్యాలెట్లో వేయడానికి ఎన్నికల సిబ్బందిని పేర్కొన్నారు. ‘ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ.?’ అని ఆ లేఖలో ప్రశ్నించారు. తన కు న్యాయంగా రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని.. ఆ వ్యక్తి లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. తన ఉద్యోగ జీవితమంతా ప్రభుత్వానికి సేవలు అందించింది, రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిలు, ఇతర ప్రయోజనాలు ఇంకా అందలేదని పేర్కొన్నారు.

లేఖలో పెన్షనర్ ఆవేదన.. సోషల్ మీడియాలో వైరల్
ఈ లేఖ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసిన పెన్షనర్ తాను ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాడు. ఎన్నిసార్లు అధికారులను కలిసినా.. సరైన స్పందన రాలేదని, ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాలేదని లేఖలో పేర్కొన్నారు. తన సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాలని, తనలాంటి వారు ఎందరో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం బయటకు రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి..అయితే, పెన్షనర్ ఆవేదన చూసిన వారికి ఆయన ఏంటో అర్దం అయింది. తన సమస్య వ్యక్తిగతమైనదే అయినా, వేలాది మంది ఉద్యోగ విరమణ ఇదే పరిస్థితి ఉందని లేఖలో పేర్కొన్నట్లు చూపుతున్నారు. ఈ లేఖ బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా, మరికొందరు పెన్షనర్ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

