ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ఏపీ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లుగా ప్రతిపాదించారు. వ్యయం రూ.2,56,143 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా వేసింది. ఆదరణ లోటు రూ.22,002 కోట్లుగా దించగా..ద్రవ్య లోటు రూ.75,868 కోట్లుగా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇక, మహిళలు.. రైతుల కోసం భారీగా కేటాయింపులు చేసారు. ప్రస్తుతం అమలులో ఉన్న సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు.
ఏపీ బడ్జెట్ లో సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా పాఠశాల విద్య రూ.32,308 కోట్లు, వైద్య శాఖ రూ.19,306 కోట్లు, వ్యవసాయ రూ.11,745 కోట్లు, సాంఘిక సంక్షేమం రూ.11,118 కోట్లు, బీసీ సంక్షేమం రూ.23,650 కోట్లు, ఇంధన శాఖ రూ.13,934 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రూ.22,94 కోట్లు, జల18 గా22 కోట్లు ఇదే సమయంలో ప్రస్తుతం అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలకు భారీగా నిధులు పెంచారు. మహిళలు.. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తన బడ్జెట్ లో పయ్యావుల కేశవ్ స్పష్టం చేసారు. ఇందు కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు ఉన్నాయి. పెన్షన్ల పెంపు కోసం బడ్జెట్ లో ఎన్టీఆర్ భరోసా – రూ.27,719 కోట్లు కేటాయించారు. ప్రతీ నెలా ఒకటో తేదీనే పెన్షన్లు కొనసాగిస్తూ.. అర్హులకు న్యాయం అందించారు.

మహిళలు.. రైతుల సంక్షేమం కోసం కేటాయింపులు
మహిళలకు అమలు చేస్తున్న ఉచిత పథకం కోసం మంచి ఆదరణ బస్సు ప్రారంభమైన మంత్రి పయ్యావుల వివరించారు. ఈ బడ్జెట్లో స్త్రీశక్తి పథకం కోసం రూ.1,420 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రిక్ల్లోనూ ఉచిత ప్రయాణం అనుమతిస్తామని ప్రభుత్వం బస్సు స్పష్టం చేసింది. అదే విధంగా మహిళలకు పథకాల కేటాయింపులను వివరించారు. వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు, తల్లికి వందనం – రూ.9,668 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు కేటాయింపులు చేసారు. మహిళలను ఆర్దికంగా తోడ్పాటు అందిస్తూ లక్షాధికారులుగా తీర్చి దిద్దుతామని పయ్యావుల ప్రకటన. అదే విధంగా రైతుల కోసం కీలక నిర్ణయాలను ఏర్పాటు చేసింది. అన్నదాత సుఖీభవ – రూ.6,600 కోట్లు,
ధరల స్థిరీకరణ నిధి – రూ.500 కోట్లు, మత్స్యకార సేవలో – రూ.260కోట్లు, పంటల బీమా – రూ.250 కోట్లు, పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లు కేటాయింపులు చేసారు. ధాన్యం సేకరణ నిధులు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ ఉంటుంది కేశవ్ వివరించారు.

