అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు జరిగే విషయం తెలిసిందే. అయితే ఇరాన్ పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో మరో-5 వారాలు యుద్ధం జరిగే అవకాశం. అంతకంటే ఎక్కువ కాలం కూడా తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ మిలిటరీలో దాదాపు అందరూ చనిపోయారని.. ఆ దేశ ప్రజలు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ లోని మిలిటరీ అధికారుల్లో దాదాపు అందరూ మరణించారని చెప్పారు. అయితే ఇరాన్ పై యుద్ధం కొనసాగుతూనే ఉంటుందన్నారు. మరో 4 నుంచి 5 వారాలపాటు ఈ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్కు చెందిన 9 నౌకలను ధ్వంసం చేశామని తెలిపారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇరాన్ లొంగిపోవాలని భావిస్తున్నట్లు ట్రంప్ వివరించారు.
మరోవైపు ఇరాన్లో అమెరికా చర్యకు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మద్దతు. అమెరికాకు యూరప్ సంపూర్ణ మద్దుతు ఇస్తుందని మార్క్ రుట్టే సూచిస్తుంది. ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ పై వరుసగా మూడోరోజు దాడులు కొనసాగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఇరాన్ లో 555 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లు ఇరాన్ మీడియా. ఇదే దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఖమేనీ భార్య తాజాగా మృతి చెందింది.

