seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 12:56 pm Digital Edition : SEEMA KIRANAM

YS Jagan: అసెంబ్లీకి హాజరుపై జగన్ తాజా నిర్ణయం..! విపక్ష హోదాపైనా..! | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ కీలక ఆదేశాలు

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి విపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. ఈసారి బడ్జెట్ సమావేశాల్లోనూ గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీకి హాజరైన జగన్ (వైఎస్ జగన్), ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశానికి కూడా జగన్ హాజరు కాలేదు. ఇవాళ తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రంగా జరుగుతున్న పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. అనంతరం కీలక నిర్ణయం.

వైఎస్సార్సీపీకి విపక్ష పార్టీ హోదా ఇవ్వనందుకు నిరసనగా.. ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఉండాలని జగన్ నిర్ణయించారు. అయితే అసెంబ్లీలో మాత్రమే విపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి ఎప్పటిలాగే ఈసారి కూడా శాసనసభకు మాత్రమే ఎమ్మెల్యేలు హాజరుకాకూడదని నిర్ణయించారు. దీంతో మండలికి మాత్రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా శాసనమండలిలో గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు

మనకు అసెంబ్లీలో బలం తక్కువ, అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందని, సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్షనేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం మద్దతు. ఇలాంటి ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి బయట మీడియాతో మాట్లాడుతున్నామని, ఆధారాలతో సహా అన్నీ వివరిస్తున్నామన్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు

మరోవైపు ప్రభుత్వం స్కామ్‌ల మయంగా మారిందని, ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి ఉందని జగన్ వారికి తెలిపారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమి 54 ఎకరాలు గీతం వర్సిటీకి ఇచ్చేశారని, ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఎవరూ ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోందని, అదే ‘క్యాష్‌.. సూట్‌కేసు.. రాజేష్‌.. లోకేష్‌.’. అన్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. కళ్లు మూసి తెరిచేలోపు మూడు గడుస్తుంది, వచ్చేది మన ప్రభుత్వమేనన్నారు. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి కూడా అన్నారు. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం మీకు.

Source link