seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 7:05 am Digital Edition : SEEMA KIRANAM

Weather: నాలుగు రోజుల్లో వానలు.. నిప్పులు కురిపిస్తున్న భానుడు! | AP వాతావరణ హెచ్చరిక: మార్చి 7 నుండి కోస్తా ఆంధ్ర జిల్లాలకు వర్ష సూచన; రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి

ఆంధ్ర ప్రదేశ్

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండుతుండగానే, వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ప్రస్తుతం భానుడి ప్రతాపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్న తరుణంలో, ఈ నెల 7వ తేదీ నుంచి కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా గరిష్ఠ భవనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వర్ష సూచన ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే అంశం.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను గమనిస్తే, ఉత్తర ఒడిశా నుంచి విదర్భ మీదుగా ఛత్తీస్‌గఢ్ వరకు సముద్ర మట్టానికి 0.9 ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. దీనితో పాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా మరాఠ్వాడ వరకు మరో విన్ డిస్కంటిన్యూటీ (గాలి విచ్ఛిన్నత) ఏర్పడింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసేలా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

AP వాతావరణ హెచ్చరిక కోస్తా ఆంధ్ర జిల్లాలకు మార్చి 7 నుండి వర్ష సూచన రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి

మరోవైపు, రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. సోమవారం నాడు అత్యధికంగా 38 కర్నూలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల, కడప, అనంతపురం జిల్లాలో కూడా ఎండ 37 డిగ్రీలను దాటేసింది. నరసాపురం, కావలి వంటి తీర ప్రాంతాలు సాధారణం 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రానున్న కొద్ది రోజులకు వాతావరణ హెచ్చరికలను సూచిస్తోంది.. మార్చి 3న కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో కొన్ని చోట్ల తేలికపాటి పొగమంచు (Shallow Fog) కురిసే అవకాశం ఉంది. మార్చి 4న రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఆవరించే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు వాతావరణం పొడిగానే కనిపిస్తుంది, మార్చి 7వ తేదీ నుంచి కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆంగ్ల సారాంశం

వాతావరణం: మార్చి 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరోవైపు కర్నూలు, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి.

Source link