Monday, March 2, 2026
ads
📄 ePaper
HomeతెలంగాణPM Kisan:పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం..!! | పీఎం కిసాన్-...

PM Kisan:పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం..!! | పీఎం కిసాన్- అన్నదాత సుఖీబావ పథకం తదుపరి విడత నివేదికలు వచ్చే వారంలో విడుదల కానున్నాయి

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

రైతులకు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీపి కబురు. గత ఏడాది కాలంగా పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయి. ఇప్పుడు మరో విడత పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన కీలక సమాచారం అందుతోంది. రెండు పథకాలు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. ఇప్పుడు ఈ ముహూర్తం పైన స్పష్టత వచ్చింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది.

కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా అందించే పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ తేదీన ప్రధాని విడత నిధులను విడుదల చేసారు. కాగా.. ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తోంది. ఈ రెండు పథకాల నిధులు ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 14 వేలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కాగా, 22వ విడత నిధులను ముందుగా సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. అయితే, ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 21వ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 21 విడతల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు.

pm-kisan-annadata-sukhibava-scheme-next-installment-repos-repos-repo-వరుస-వారంలో-విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు

రెండు పథకాల నిధులు ఒకే సారి రైతుల ఖాతాల్లో

కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్‌తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్‌తో కలిపి రెండు విడతల్లో రూ 5 వేలు చొప్పున రూ 10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, ఇప్పుడు మూడో విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయనుంది. మూడో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో రూ 4 వేలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం రూ.20 వేలు అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న రూ.6 వేలు మినహాయించి.. మిగిలిన రూ.14 వేలు మూడు విడతలుగా పీఎం కిసాన్‌తో పాటుగా అందించాలని నిర్ణయించింది. దీంతో… పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధులు కలిసి ఫిబ్రవరి రైతుల ఖాతాల్లో ఒకే సారి రూ 6 వేలు జమ అయ్యే అవకాశం.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular