ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
<!--
--> <!-- -->తన ఇంటిపేరు కొణిదెల పేరుతో ఓ గ్రామం ఉందని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan).. దాన్ని గతంలో దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ గ్రామానికి తన శాఖ చేయవలసిందంతా చేస్తున్నారు. ఈ గ్రామంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. పవన్ చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామానికి మహర్దశ పట్టిందని ఇప్పుడు కూటమి నేతలు గర్వంగా చెబుతున్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టితో కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రూ.50 లక్షల విరాళం అందించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. దీనితోపాటు పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, సాస్కీ, గ్రామీణ రహదారి సబ్ ప్లాన్ వంటి పథకాల ద్వారా వచ్చిన నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, కాలువల అభివృద్ధి, గోకులాలు, ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం ప్రభుత్వ పథకాల నుంచే ఇప్పటి వరకు సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులు కొణిదెల గ్రామాభివృద్ధికి ఖర్చుచేశారు.

2019 ఎన్నికల సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఉండగా తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కొణిదెల వాసులు పవన్ కళ్యాణ్ ను వివరాలు. తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్నానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. గత ఏడాది నందికొట్కూరు నియోజకవర్గంలో ఫారం పాండ్స్ ప్రారంభోత్సవం వెళ్లిన సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రామాభివృద్ధికి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. ఈ నిధులతో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

దీంతో అధికారులు గ్రామంలో సమస్యను పరిష్కరించారు. అనంతరం రూ.50లక్షలతో ఇక్కడ 90 వేల లీటర్ల రక్షిత ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం. ఈ ట్యాంక్ కొణిదెల గ్రామం పరిధిలో 2 వేల మంది దాహార్తి తీర్చనుంది. వేసవికి ముందే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కావడం పట్ల ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనందం వ్యక్తం చేశారు.