భారతదేశం
ఓయ్-సయ్యద్ అహ్మద్
కేరళ(కేరళ) అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు (kerala Elections) జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలపై అందరి దృష్టీ. దీనికి ప్రధాన కారణం ఈసారి అక్కడ రెగ్యులర్ గా పోటీ పడే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కి తోడు ఎన్డీయే కూడా బరిలో ఉండటమే. ఈ ముగ్గురి మధ్య రేసులో ఎవరు గెలువబోతున్నారు, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఓటర్ల నాడి ఎలా ఉందన్న ఉత్కంఠ. ఇలాంటి సమయంలో లోక్ పోల్ సంస్థ తమ తాజా సర్వేలను పరిశీలిస్తుంది.
కేరళలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ లేదా కూటమికి ఎడ్జ్, ఎన్ని సీట్లు సాధించబోతున్నారు, ఓట్ల శాతం ఎలా ఉండబోతోందన్న అంశంపై లోక్ పోల్ తమ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఇందులో అధికార ఎల్డీఎఫ్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తప్పడం లేదు. ఇక్కడ విపక్ష యూడీఎఫ్ ఈసారి అధికారంలోకి రాబోతున్నట్లు తేలింది. అలాగే ఎన్డీయే ప్రభావం లేదని కూడా లోక్ పోల్ సర్వే తేల్చేసింది.

ఎన్నికలకు వెళ్లే స్థితికి సంబంధించి మా మెగా ముందస్తు ఎన్నికల అంచనాలను ప్రదర్శిస్తున్నాము #కేరళంఫిబ్రవరి 9 నుండి 24 వరకు నిర్వహించిన మా భూమి సర్వే ఆధారంగా.
▪️ LDF 51 – 59 | 39-42%
▪️ UDF 81 – 86 | 43-45%
▪️ NDA 0 – 2 | 13 – 25%నమూనా పరిమాణం: 42,000, 300/… pic.twitter.com/TSzj1pzOe4
— లోక్ పోల్ (@LokPoll) ఫిబ్రవరి 27, 2026
140 సీట్లు ఉన్నాయి కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమికి అత్యధికంగా 81 నుంచి 86 సీట్లు వస్తాయని లోక్ పోల్ అంచనా వేస్తోంది. అలాగే అధికార ఎల్డీఎఫ్ కూటమి కేవలం 51 నుంచి 59 సీట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. ఎన్డీయేకు 0 నుంచి 2 సీట్లు రావొచ్చని. అలాగే యూడీఎఫ్ మొత్తం ఓట్లలో 43 నుంచి 45 శాతం ఓట్లు లభిస్తాయని, ఎల్డీఎఫ్ 39 నుంచి 41 శాతం ఓట్లను, ఎన్డీయే కేవలం 13 నుంచి 15 శాతం ఓట్లను సాధిస్తుందని లోక్ పోల్ అంచనా వేస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి 24వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించినట్లు లోక్ పోల్ సంస్ధ ప్రసారం.
ఉత్తర, మధ్య కేరళలో యూడిఎఫ్ ఆధిక్యత ఉండగా.. దక్షిణాదిలో ఎల్డిఎఫ్ తన నివేదనలో నిలుపుకుంటుందని సర్వే వెల్లడించింది. అలాగే శబరిమల, సంబంధిత సమస్యలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతున్నాయని. క్రైస్తవ ఓటు బ్యాంకు ఇప్పటికీ యూడీఎఫ్ తోనే ఉందని తేల్చింది. అలాగే ముస్లిం సమాజం దాదాపుగా ముస్లింలీగ్ వైపే ఉంది. వరి రైతులు, మత్స్యకారులు, ప్రభుత్వ ఉద్యోగులలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందని.

