తెలంగాణ
ఓయి-లింగారెడ్డి గజ్జల
సినిమా పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. గత ఏడాది నవంబరులో సైబర్ క్రైమ్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనుమతి లేకుండా కొత్తగా విడుదలైన సినిమాలను ఆన్లైన్లో ప్రసారం చేయడం, కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడటం వంటి ఆరోపణలతో ఈ కేసు నమోదు అయింది.
బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, కొన్ని కఠిన విచారణలతో రవికి ఉపశమనం కల్పించింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని, తన పాస్పోర్ట్ను కోర్టులో డిపాజిట్ కోరింది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై కూడా ఆంక్షలు విధించింది. పోలీసుల అనుమతి లేకుండా ఇంటర్నెట్ వాడకూడదని స్పష్టంగా.

ఐబొమ్మ రవి రోజూ రావాల్సిందే..
ఇంకా ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ (CCS) పోలీసుల ఎదుట ఐబొమ్మ రవి హాజరు కావాలని షరతు విధించింది. విచారణకు పూర్తిగా సహకరించాలి, సాక్ష్యాధారాలను ప్రభావితం చేయకూడదు, కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం.
కేసు నేపథ్యం..
సినిమా పరిశ్రమలో ఇబొమ్మా పైరసీ సమస్య చాలాకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమాలు అనధికారిక వెబ్లో అందుబాటులోకి రావడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఐబొమ్మ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కొత్త సినిమాలు అక్రమంగా ప్రసారం అవుతున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్నికల్ ట్రాకింగ్, డిజిటల్ సాక్ష్యాల సేకరణ అనంతరం ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు.
నిర్మాతలకు షాక్..
ఈ కేసు టాలీవుడ్ సహా పలు చిత్ర పరిశ్రమల్లో చర్చకు దారితీసింది. పైరసీకి వ్యతిరేకంగా కఠిన చర్యలు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయల పెట్టుబడులతో నష్టపోయిన సినిమాలు అక్రమంగా లీక్ కావడం వల్ల పరిశ్రమకు తీవ్ర ఆర్థిక కలుగుతోందని వారు వాదిస్తున్నారు.
ఇప్పుడు కోర్టు షరతులతో బెయిల్ ఇచ్చినప్పటికీ, కేసు విచారణ కొనసాగుతుంది. తుది తీర్పు వచ్చే వరకు ప్రక్రియ ముందుకు సాగనుంది. ఈ కేసు ఫలితం సినిమా పైరసీ నియంత్రణలో కీలకంగా మారే అవకాశం ఉందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

