seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 11:49 pm Digital Edition : SEEMA KIRANAM

Half-Day Schools: ఏపీలో ఒంటిపూట బడులు-ఎప్పటి నుంచి అంటే ? టైమింగ్స్ ఇవే..! | వేడి తరంగాల కారణంగా AP హాఫ్-డే పాఠశాలలు మార్చి 16న ప్రారంభమవుతాయి; సమయాలు విడుదలయ్యాయి

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీలో వేసవి తాపం పెరుగుతోంది. దీనితో పాఠశాలలకు వెళ్తున్న విద్యార్దులు అల్లాడుతున్నారు. మరో పరీక్షల సీజన్ కావటంతో స్కూళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ స్థితిలో వాతావరణం పరిస్ధితుల్ని దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు (సగం-రోజుల పాఠశాలలు) నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ఇవాళ ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం రేపాటి నుంచి స్కూళ్లను ఒక పూట మాత్రమే ఉంచారు.

ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే వేసవి తాపం దృష్ట్యా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్దులకు ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గుర్తించారు.

హీట్ వేవ్ టైమింగ్‌ల కారణంగా AP హాఫ్-డే పాఠశాలలు మార్చి 16 నుండి ప్రారంభమవుతాయి

మరోవైపు ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది..మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం ఉంది. ఈ నెల 18,19,20 తేదీల్లో కృష్ణా,గుంటూరు,బాపట్ల, ప్రకాశం, పల్నాడు, జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూల్, నంద్యాల, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు ఉంటాయని తెలుస్తోంది. మార్చ్ 22 నుంచి అకాల వర్షాలు తగ్గుముఖం పడతాయని ఊహించిన తర్వాత.

Source link