భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతోంది.. తమిళనాడు. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఐఐఏడీఎంకేతో పాటు తమిళగ వెట్రి కజగం.. (TVK) పూర్తి స్థాయి ఎన్నికల సంగ్రామానికి దిగబోతోంది. ఫలితంగా త్రిముఖ పోటీ. తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నారు టీవీకే ప్రముఖ నటుడు దళపతి విజయ్. ఈ టీవీ షోకే ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.
ఈ పరిణామాల మధ్య తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత సీనియర్ నాయకుడు ఓ. పన్నీర్సెల్వం.. అధికార డీఎంకేలో చేరారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వీర విధేయుడైన పన్నీర్ సెల్వం కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. స్టాలిన్ చేతుల మీదుగా తీర్థం పుచ్చుకున్నారు.

మంత్రి పీకే శేఖర్ బాబు మధ్యవర్తిత్వంతో ఇది సాధ్యపడింది. పన్నీర్ సెల్వం రాకతో డీఎంకేకు బిగ్ బూస్ట్ లభించినట్టయింది. ఓపీఎస్ ప్రవేశం డీఎంకేకు వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. దక్షిణ తమిళనాడులోని థేవర్ సామాజిక వర్గం ఓటుబ్యాంక్ బలంగా ఉన్న వారికి బలమైన మద్దతు ఉంది. ఇది- ఏఐఏడీఎంకేను దెబ్బకొడుతుందని, ఓటు బ్యాంకు చీల్చి, అసంతృప్త క్యాడర్ను డీఎంకే వైపు ఆకర్షిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఓపీఎస్.. 2016లో జయలలిత మరణం పార్టీలో తీవ్ర అధికార పోరాటంలో చిక్కుకున్నారు. ఎడప్పాడి పళనిసామి (ఐపీఎస్) తో వైరం ఏఐఏడీఎంకే చీలికకు దారితీసింది. దీంతో సంస్థాగతంగా పార్టీలో పట్టును కోల్పోయారు. అనంతరం బహిష్కరణకు సిద్ధరాయన. దీని తర్వాత పన్నీర్ సెల్వం స్వతంత్ర రాజకీయ గుర్తింపు కోసం ప్రయత్నించారు గానీ అది పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు.
ఏఐఏడీఎంకే వర్కర్స్ రిట్రీవల్ ఆర్గనైజేషన్ కింద రాష్ట్రవ్యాప్తంగా అందించారు. జయలలిత వారసుడిగా ప్రకటించినప్పటికీ, ఆయన వర్గం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలు సమీపించి ఏఐఏడీఎంకేతో తిరిగి కలవడానికి ఓపీఎస్ సుముఖత చూపారు. ఈపీఎస్ను పెద్దన్నయ్యగా సంబోధించారు. దీన్ని ఈపీఎస్ పట్టించుకోలేదు. సయోధ్యను ప్రయత్నాలను తోసిపుచ్చారు. ఓపీఎస్ ను తిరిగి పార్టీలోకి చేర్చుకునే అవకాశాలను కొట్టిపారేశారు.
ఆంగ్ల సారాంశం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మరియు బహిష్కరించబడిన అన్నాడీఎంకే నాయకుడు ఓ పన్నీర్సెల్వం, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మద్దతుదారుల మద్దతుతో స్టాలిన్ పాలక శిబిరాన్ని బలోపేతం చేస్తూ ఆశ్చర్యకరమైన చర్యలో DMKలో చేరారు.