seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 1:05 am Digital Edition : SEEMA KIRANAM

Annadata Sukhibhava PM Kisan : నేడే రైతుల ఖాతాల్లో 6 వేల జమ…! | అన్నదాత సుఖీభవ PM-KISAN యొక్క ₹6,000 వాయిదా ఈరోజు రైతుల ఖాతాలకు జమ చేయబడింది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీలో కూటమి ప్రభుత్వం రైతన్నలకు ‘అన్నదాత సుఖీభవ’ (అన్నదాత సుఖీభవ) నిధులను ఇవాళ జమ చేయనుంది. ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 3.0 (annadata sukhibhava-pm kisan scheme)’లో భాగంగా రైతులకు ఇవాళ ఈ సాయం అందజేస్తారు. ఈ మూడవ పథకం విడతగా మొత్తం 46.85 లక్షల మందికి, రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.6వేలు జమ అవుతాయి. మూడో విడత కోసం రూ.2,676 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం రూ.14 వేలను ప్రభుత్వ రైతుల ఖాతాల్లో జమ చేశాయి. ఇవాళ ఇచ్చే రూ.6 వేలతో కలిపి రైతులకు హామీ ఇచ్చిన ఏడాదికి రూ.20 వేల సాయం పూర్తి.

అన్నదాత సుఖీభవ 3.0 నిధులను సీఎం చంద్రబాబు ఇవాళ కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం, సూరంపల్లిలో విడుదల చేస్తారు. సూరంపల్లిలో జరిగే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4.20 గంటలకు సీఎం సూరంపల్లికి చేరుకుంటారు. 4.25 గంటల నుంచి 4.55 గంటల వరకు రైతులతో ముఖాముఖి అవుతారు. 05.00 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. అనంతరం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.

అన్నదాత సుఖీభవ PM-KISAN s 6 000 వాయిదాలు ఈరోజు రైతుల ఖాతాలకు జమ చేయబడ్డాయి

అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది కూటమి సూపర్ -6లో. ఇందులో కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మూడు విడతల్లో ప్రతీ రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేలు జమ చేస్తోంది. ఈ మేరకు 2025 ఆగస్ట్ 2న మొదటి విడతగా రూ.7 వేల చొప్పున రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రెండవ విడతగా రూ.7 వేలు, రూ.3,135 కోట్లు కలిపి రూ.6,309 కోట్లు రైతులకు అందించారు. ఇవాళ మూడో విడతలో రూ.6 వేల చొప్పున 46.85 లక్షల మందికి రూ.2,676 కోట్లు ఇస్తున్నారు. దీంతో రైతులకు ఇచ్చిన హామీ ఈ ఏడాదికి పూర్తవుతుంది.

Source link