భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
పంజాబ్ పోలీసులు అమృత్సర్లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పంజాబ్, ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఉగ్రవాద ముఠా గుట్టురట్టు చేశారు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడి నుంచి ఐడీ, పిస్టల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇక పాకిస్థాన్ కు చెందిన ఓ ఉగ్రవాది సాయంతో నిందితుడు భారత్లో ఉగ్ర దాడులకు ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తులో అధికారులు పేర్కొన్నారు.
పంజాబ్ స్పెషల్ అమృత్సర్లోని స్టేట్ సెల్ బృందం ముందస్తు నిఘా సమాచారం మేరకు ఆపరేషన్ భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది. ఈ లో భాగంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఆపరేషన్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి రిమోట్ కంట్రోల్తో పనిచేసే IED, విదేశీ పిస్టల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్కు చెందిన ఓ ఉగ్రవాది సాయంతో నిందితుడు ఢిల్లీ, పంజాబ్ ఇతర రాష్ట్రాల్లో దాడులు చేయడానికి ప్లాన్ చేసిన అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇదే పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్.. సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఈ భారీ ఉగ్ర కుట్రను పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు పాకిస్థాన్ బోర్డర్ నుంచి భారత్లోకి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇటీవల పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన సరిహద్దు ప్రాంతాల్లో సెక్యూరిటీ టైట్ చేశారు అధికారులు.

