భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక పెద్ద కుట్ర దాగి. ఈ ఘటనపై తక్షణమే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తాజాగా ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో ఎన్సీపీ (ఎస్పీ) నేత రోహిత్ పవార్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ ఉపయోగించిన విమాన ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్లనే జరగదని.. అది ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కీలక అంశాలను బహిర్గతం చేశారు. అజిత్ పవార్ నిజానికి జనవరి 27 రాత్రి కారులో పుణే వెళ్లాల్సి ఉంది.. కానీ ఓ నాయకుడి ఒత్తిడి వల్ల ప్రయాణం వాయిదా పడింది. దాంతో మరుసటి రోజు ఉదయం విమానంలో వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.
ఈ మేరకు ఘటన జరిగిన రోజు విమానాన్ని నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్ ట్రాక్ రికార్డ్పైనా రోహిత్ పవార్ పలు ప్రశ్నలు సంధించారు. గతంలో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న కెప్టెన్ సుమిత్ కపూర్ ను చివరి నిమిషంలో ఎందుకు నియమించారని ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో మద్యం సేవించినందుకు పైలట్ సుమిత్ను మూడు సస్పెండ్ చేసినట్లు గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి పూర్తి అధికారం ఉండదని.. లేదా అమెరికాకు చెందిన NTSB బ్రిటన్ కు చెందిన AAIB వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక జనవరి 28, 2026న ముంబై నుండి బారామతి విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా ఐదుగురు మరణించారు.

