Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఅకస్మాత్తుగా విషమించిన శరద్ పవార్ ఆరోగ్యం: ఆసుపత్రిలో అడ్మిట్..!! | ఎన్సీపీ అధినేత శరద్ పవార్...

అకస్మాత్తుగా విషమించిన శరద్ పవార్ ఆరోగ్యం: ఆసుపత్రిలో అడ్మిట్..!! | ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోగ్య సమస్యలతో బారామతి నుంచి పూణెలోని ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోంది. ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వెంటనే పలువురు నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

శరద్ పవార్.. బారామతిలోని ‘గోవింద్ బాగ్’ నివాసంలో ఉంటున్నారు. కొద్దిసేపటి కిందట ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో బారామతి పూణేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో ఆయన వెంట కుమార్తె, లోక్ సభసభ్యురాలు సుప్రియా సూలే, అల్లుడు సదానంద్ సూలే ఉన్నారు.

ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ ఆరోగ్య సమస్యలతో బారామతి నుండి పూణెలోని ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం

ఈ ఉదయం నుంచీ ఆయన ఆరోగ్యం కొంత క్షీణిస్తూ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు ఇద్దరు డాక్టర్లతో కూడిన అంబులెన్స్ ‘గోవింద్ బాగ్’ నివాసానికి చేరుకుంది. ఇంట్లోనే ఆయనకు ప్రాథమిక పరీక్షలను నిర్వహించారు. రెండు గంటలకు పైగా వైద్య పరీక్షలు కొనసాగుతున్నట్లు.

ఆ సమయంలో- శరద్ పవార్ కు మరింత మెరుగైన, పూర్తి స్థాయి చికిత్స, చికిత్స అవసరమని డాక్టర్లు సలహా ఇవ్వడంతో ఆయనను హుటాహుటిన పూణేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచారు. ఆయన అనారోగ్యానికి గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు. గొంతు ఇన్ఫెక్షన్, జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

శరద్ పవార్ వయస్సు, గత ఆరోగ్య చరిత్ర దృష్ట్యా ఈ సమాచారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళనను నింపింది. పవార్ చేరిన పూణే ఆసుపత్రి వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. సుప్రియ సూలే నిరంతరం డాక్టర్లతో సంప్రదిస్తున్నారు. సాయంత్రంలోగా అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular