Friday, March 13, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపురందేశ్వరి చేతుల్లో కొత్త విద్యా చట్టం.. ఒకే దేశం, ఒకే విద్యా కమిషన్! | వికాసిత్...

పురందేశ్వరి చేతుల్లో కొత్త విద్యా చట్టం.. ఒకే దేశం, ఒకే విద్యా కమిషన్! | వికాసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు 2025: UGC మరియు AICTE కొత్త సింగిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ మూవ్ బ్యాక్

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయి-లింగారెడ్డి గజ్జల

భారత ఉన్నత విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (VBSA) బిల్లు-2025’ను తీసుకురాబోతోంది. దశాబ్దాలుగా విద్యా సంస్థలను నియంత్రిస్తున్న యూజీసీ (UGC), ఏఐసీటీఈ (AICTE), ఎన్‌సీటీఈ (NCTE) వంటి సంస్థల స్థానంలో.. ‘ఒకే దేశం-ఒకే నియంత్రణ సంస్థ’ అనే నినాదంతో ఒకే కేంద్ర కమీషన్‌ను ఏర్పాటు చేయడమే ప్రధాన ఉద్దేశం.

ప్రస్తుత విద్యా వ్యవస్థలో వివిధ సంస్థల మధ్య సమన్వయ లోపం, మితిమీరిన పేపర్‌వర్క్, నిబంధనలు గందరగోళం వల్ల ఉన్నత విద్య కుంటుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు యూజీసీ, ఏఐసీటీఈలు పూర్తి మద్దతు ప్రకటించాయి. 12 మంది సభ్యులతో కూడిన కొత్త కమీషన్ (VBSA) ఏర్పాటు చేయడం వల్ల క్రెడిట్ బదిలీలు, ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు సులభతరం అవుతాయి, 2035లోపు విద్యార్థుల నమోదులో 50 మందిని పెంచడం గురించి పార్లమెంటరీ కమిటీకి అధికారులు వివరించారు.

వికాసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు 2025 UGC మరియు AICTE వెనుకకు కొత్త ఒకే ఉన్నత విద్యా నియంత్రకం తరలింపు

పురందేశ్వరి అధ్యయనం!

ప్రస్తుతం ఈ కీలక బిల్లును పార్లమెంట్ సంయుక్త కమిటీ (JPC) అధ్యయనం చేస్తోంది. దీనికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వం వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్న తరుణంలో, ఆయన వదిన అయిన పురందేశ్వరి ఈ బాధ్యతలు చేపట్టడం రాజకీయంగానూ ఆసక్తి కలిగిస్తోంది.

ఆందోళనలు – వివాదాలు:

అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  • రాష్ట్రాల హక్కులు: ఉన్నత విద్యపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం లాగేసుకుంటోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని వారు వాదిస్తున్నారు.
  • స్వయంప్రతిపత్తి: వర్సిటీల స్వయంప్రతిపత్తి తగ్గిపోయి, అన్నీ చేతుల్లోకి వెళ్తాయని కేంద్రం విమర్శిస్తున్నారు.
  • కఠిన నిబంధనలు: నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, విద్యా సంస్థలను మూసివేస్తే కొత్త కమీషన్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ బిల్లులపై ఎప్పుడు, ఎన్నిసార్లు చర్చలు జరిపారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో వివాదం ముదురుతోంది. ఒకవైపు సంస్కరణలు కావాలన్న వాదన, మరోవైపు రాష్ట్రాల హక్కుల రక్షణ కోసం పోరాటం.. ఈ మధ్య ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు’ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular