Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవామ్మో.. బాబా వంగా భవిష్యవాణి నిజం అయింది!! | ఇరాన్‌పై యుఎస్ ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్...

వామ్మో.. బాబా వంగా భవిష్యవాణి నిజం అయింది!! | ఇరాన్‌పై యుఎస్ ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ స్ప్రెడ్ గల్ఫ్‌ను తీవ్రతరం చేయడంతో బాబా వంగా చిల్లింగ్ ప్రిడిక్షన్ తిరిగి వచ్చింది

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకు ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువారు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు సాగాయి. బహ్రెయిన్ లో ఏకంగా అమెరికా నావల్ బేస్ కూడా ఇరాన్ సంధించిన శక్తిమంతమైన మిస్సైళ్ల ధాటికి భస్మీపటలం అయింది.

ఇరాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ, ఖతార్‌లపై ఏకకాలంలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్‌ల సంయుక్త దాడికి ప్రతీకారంగా ఈ చర్యకు దిగింది. ఈ దాడులు.. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ జైంట్‌గా ఇరాన్‌లోని కీలక స్థావరాలపై దాడులు చేయగా.. దీనికి ప్రతిదాడికి దిగింది ఇరాన్. బహ్రెయిన్‌లోని యూఎస్ నెవీ బేస్ ను ధ్వంసం చేసిపడేసింది.

ఇరాన్‌పై యుఎస్ ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ స్ప్రెడ్ గల్ఫ్‌ను తీవ్రతరం చేయడంతో బాబా వంగా చిల్లింగ్ ప్రిడిక్షన్ తిరిగి వచ్చింది

ఈ దాడుల వార్తలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో- ఇక అందరి దృష్టి కూడా బల్గేరియన్ మహిళా ఆధ్యాత్మికవేత్త బాబా వంగా అంచనాలపై పడింది. 1996లో బాబా వంగా మరణించారు. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆమె అప్పట్లోనే ఊహించారు. 2026 ప్రారంభంలోనే తూర్పు నుండి ఓ మహా యుద్ధం ఆరంభమౌతుందని ఆమె జోస్యం చెప్పారు. ఇది ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టినట్టయిందని చాలామంది విశ్వసిస్తున్నారు.

తాజా పరిణామాలను బాబా వంగా జోస్యంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణ క్రమంగా ప్రపంచమంతటా విస్తరించింది, ఆమె భవిష్యవాణి నిజమవుతోందని. తాజాగా చోటు చేసుకుంటోన్న దాడులు ఒక్క ఇరాన్- ఇజ్రాయెల్ కే పరిమితం కావట్లేదు. గల్ఫ్ దేశాలు ఆవంరించింది.

బాబా వంగా జోస్యం ప్రకారం- ఇది పాశ్చాత్య ప్రపంచాన్ని ముఖ్యంగా యూరప్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. యూరప్‌లోని భూమి పూర్తిగా నిస్సారంగా, అస్థిరంగా మారుతున్న దశాబ్దాల కిందటే ఆమె అంచనా వేశారు, ఇది విస్తృతమైన ఆర్థిక, సామాజిక సవాళ్లకు ఉంది. ఈ యుద్ధం తర్వాత రష్యా ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అవతరించి, అంతర్జాతీయ శక్తి మార్పును పునర్నిర్మించగలదని గతంలో పేర్కొన్నారు.

ఈ ఏడాదిలోనే శక్తిమంతమైన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా ఆమె అంచనా వేశారు. ఇవి మానవులకు, భూమికీ ఎంతగానో ప్రమాదకరమని. విపత్తు భూమిని చుట్టుముట్ట నిశ్చయత. ఇప్పుడు ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం వాస్తవ రూపాన్ని దాల్చిన నేపథ్యంలో ఈ విపత్తులు కూడా మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయనడంలో సందేహాలు ఉండకపోవచ్చు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular