seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 12:38 pm Digital Edition : SEEMA KIRANAM

8న ట్రాఫిక్ ప్రమాదాలపై అవగాహన : ఎం.శ్రీహర్ష

8న ట్రాఫిక్ ప్రమాదాలపై అవగాహన

 

కర్నూలు ప్రగతి సమితి అధినేత ఎం.శ్రీహర్ష

 

కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 06, (సీమకిరణం న్యూస్) :

 

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో ఈ నెల 8న డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ పోలీసులతో సంయుక్తంగా గుత్తి పెట్రోల్ బంక్ కూడలిలో అవగాహన కార్యక్రమం, సర్వమత ప్రార్థనలు, పోస్టర్ల ఆవిష్కరణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డ్రైవర్లు తప్పనిసరిగా హాజరై రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలని శ్రీహర్ష కోరారు.